 
                                                            పటాన్ చెరు, అక్టోబర్ 31: మాజీ మంత్రి, సిద్దిపేట శాసనసభ్యుడు తన్నీరు హరీష్ రావును పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పరామర్శించారు. ఇటీవల హరీశ్ రావు తండ్రి సత్యనారాయణ మరణించిన విషయం విధితమే. శుక్రవారం ఉదయం నియోజకవర్గ పరిధిలోని మాజీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులతో కలిసి హైదరాబాద్ కోకాపేటలోని హరీశ్ రావు నివాసానికి వెళ్లారు. సత్యనారాయణ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.
హరీశ్ రావును ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ ప్రభాకర్, మాజీ జెడ్పిటిసిలు సుధాకర్ రెడ్డి, కుమార్ గౌడ్, మాజీ ఎంపీపీలు యాదగిరి యాదవ్, శ్రీశైలం యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ కుమార్, అమీన్పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ పాండురంగారెడ్డి, మాజీ వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, సీనియర్ నాయకులు విజయ్ భాస్కర్ రెడ్డి, దశరథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, పాండు, షేక్ హుస్సేన్, తదితరులు పాల్గొన్నారు.
 
                            