జహీరాబాద్, జూన్20 : మంత్రి కేటీఆర్ బుధవారం నిర్వహించే జహీరాబాద్ పర్యటనను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు కోరారు. సోమవారం జహీరాబాద్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు.
బుధవారం మంత్రి కేటీఆర్ పర్యటనలో భాగంగా ఉదయం 10గంటలకు నీమ్జ్లో ఏర్పాటు చేసే రక్షణ ఉత్పత్తుల పరిశ్రమకు శంకుస్థాపన, ఎంజీ పరిశ్రమలో భూమిపూజ చేస్తారని వెల్లడించారు. అనంతరం బాగారెడ్డి స్టేడియంలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తామన్నారు.
జహీరాబాద్ పట్టణానికి తొలిసారి వస్తున్న మంత్రి కేటీఆర్కు 10వేల మందితో ఘన స్వాగతం పలుకుతామన్నారు.
జహీరాబాద్ మున్సిపాలిటీకి కేటాయించిన రూ.50కోట్లతో చేపట్టే పనులకు శంకుస్థాపన చేస్తారని చెప్పారు. రాబోయే రోజుల్లో పట్టణం మరింత అభివృద్ధి చెందుతుందని వివరించారు. 12,600ఎకరాల్లో నిర్మించనున్న పరిశ్రమలతో యువతకు ఉపాధి లభిస్తుందన్నారు.
పట్టణంలోని బాగారెడ్డి స్టేడియంలో 11గంటలకు నిర్వహించే బహిరంగ సభను దిగ్విజయం చేయాలని ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుంచి భారీ సంఖ్యలో తరలిరావాలని కోరారు. సమావేశంలో డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, ఆత్మకమిటీ చైర్మన్ విజయ్కుమార్, ఎం.జీ రాములు, గుండప్ప, తన్వీర్, బాబీ, పాల్గొన్నారు.