సంగారెడ్డి : మైనారిటీ సంక్షేమంలోనూ తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్ గా ఉందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖా మంత్రి తన్నీరు హరీశ్ రావు (Minister Harish Rao) పేర్కొన్నారు. టీఎస్ఐడీసీ చైర్మన్ మహమ్మద్ తన్వీర్ ఆధ్వర్యంలో జహీరాబాద్ నియోజకవర్గానికి చెందిన జహీరాబాద్ పట్టణ కాంగ్రెస్ మైనార్టీ అధ్యక్షులు మహమ్మద్ మొయిస్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు అక్బర్, మాజీ కౌన్సిలర్ ఫక్రుద్దీన్, కార్యకర్తలు శుక్రవారం మంత్రి సమక్షంలో బీఆర్ఎస్ (BRS) లో చేరారు. ఈ సందర్భంగా వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న సెక్యులర్ వైఖరి తెలంగాణలో మత సామరస్యాన్ని చాటిచెబుతున్నదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) దార్శనిక పాలన, తెలంగాణలో హిందూ ముస్లిం (Hindu-Muslims) ఐక్యతను పటిష్టం చేస్తూ, గంగా జమునా తహజీబ్ ను కాపాడుతూ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు నరోత్తం, నామ రవికిరణ్, బాసిత్, షాకి వస్తాద్, తాజుద్దీన్, అక్రమ్ తదితరులు పాల్గొన్నారు.