జహీరాబాద్/సంగారెడ్డి : జహీరాబాద్ పట్టణంలో అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్టు చేశామని ఎక్సైజ్ సీఐ అశోక్ కుమార్ తెలిపారు. బుధవారం మధ్యాహ్నం నమ్మదగిన సమాచారం మేరకు.. జహీరాబాద్ పట్టణంలోని ఫ్లై ఓవర్ బ్రిడ్జి పక్కన గంజాయి విక్రయిస్తున్నారని సమాచారం వచ్చిందన్నారు.
వెంటనే సిబ్బందితో వెళ్లి గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి ఇస్మాయిల్ను అదుపులోకి తీసుకొని అతడి వద్ద నాలుగు న్నర కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. హద్నూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వడ్డీ గ్రామానికి చెందిన ఇస్మాయిల్.. గంజాయి ప్యాకెట్లు గా చేసి విక్రయిస్తున్నాడని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.