కోహీర్, జనవరి12 : మండలంలోని దిగ్వాల్ 65వ జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృత్యువాత పడ్డాడు. ఎస్సై చల్లా రాజశేఖర్ కథనం ప్రకారం..కుంచారం మండలంలోని వెంకటాపూర్ గ్రామానికి చెందిన శివరాజ్(37) జహీరాబాద్లోని శాంతినగర్లో నివాసం ఉంటూ కవేలి వైన్స్ సమీపంలో చేపలను విక్రయించేవాడు.
వైన్స్ వద్ద పనులను ముగించుకొని తన బైక్పై జహీరాబాద్కు వెళ్తుండగా..వెనుక నుంచి అతి వేగంగా వచ్చిన లారీ బైకును ఢీకొంది. దీంతో అతడి శరీర భాగాలన్నీ తునాతునకలు కావడంతో సంఘటన స్థలంలోనే చనిపోయాడు.
పోస్టుమార్టం కోసం జహీరాబాద్ దవాఖానకు తరలించి శివరాజ్ భార్య భీమ్బాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు.