ఝరాసంగం,జూలై28 : పవిత్రమైన పుణ్యకేత్రంగా బాసిలితున్న శ్రీ కేతకి సంగమేశ్వరస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామి వారిని దర్శించుకోనేందుకు గరువారం తెల్లవారు జాము నుంచే తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మహారాష్ట ప్రాంతాల నుంచి భారీగా తరిలి రావడంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది.
అమృత గుండం నీటితో పుణ్యస్నానాలు ఆచరించి, అనంతరం పార్వతి సమేత సంగమేశ్వరుడికి కుంకుమార్చన, రుద్రాభిషేకం, పాలాభిషేకం, ఆకులపూజ, అన్నపూజలు చేశారు. ఆలయ మండపంలో స్వామి వారి ఉత్సవ విగ్రహానికి అభిషేకం చేసి మొక్కలు తీర్చుకున్నారు. భక్తుల రాకతో ఆలయప్రాంగణం శివనామ స్మరణతో మార్మోగింది.