న్యాల్కల్ : పేదింటి ఆడబిడ్డల పెండ్లికి కల్యాణ లక్ష్మి ,షాదీ ముబారక్ పథకాలు వరంలా మారాయని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు అన్నారు. బుధవారం న్యాల్కల్ మండల కేంద్రంలోని రైతు వేదక ప్రాంగణంలో లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదింటి ఆడబిడ్డల తల్లిదండ్రులకు పెండ్లి సమయంలో ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ కల్యాణ, లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. ఈ పథకాల కింద అందించే ఆర్థిక సాయంతో తల్లిదండ్రులు తమ ఆడబిడ్డల పెండ్లిని సంతోషంగా జరిపిస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు.
కార్యక్రమంలో జెడ్పిటిసి స్వప్న కుమారి, ఎంపీపీ అంజమ్మ, వైస్ ఎంపీపీ గౌసోద్దీన్, ఆత్మ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, తహసీల్దార్ రాధాబాయి, డిప్యూటీ తహసీల్దార్ విజయ్ కుమార్, ఎంపీడీవో జగదీశ్వర్, టిఆర్ఎస్ నాయకులు భాస్కర్, నరసింహారెడ్డి, సర్పంచులు మల్లారెడ్డి, మైపాల్, అమీర్, కుతుబుద్దీన్, శివ శంకర స్వామి, చంద్రన్న, ఎంపీటీసీలు శివానంద, విజయలక్ష్మి సంగమ్మ ,శ్రీనివాస్ రెడ్డి, చంద్రన్న, నాయకులు దేవదాస్, ఈశ్వర్, మచ్చేందర్ తదితరులు పాల్గొన్నారు.