సంగారెడ్డి : కోహీర్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీటీసీ-4 అనిత టీఆర్ఎస్లో చేరారు. బుధవారం హైదరాబాద్లోని మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్యే మాణిక్రావు సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. మంత్రి ఎంపీటీసీ అనితకు గులాబీ కండువా వేసి టీఆర్ఎస్లోకి సాదరంగా ఆహ్వానించారు.
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై టీఆర్ఎస్ పార్టీలో చేరానన్నారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు సంమృద్ధి, నగేశ్, నాయకులు గోవర్ధన్రెడ్డి, సాలేబాబా, తదితరులున్నారు.