గుమ్మడిదల,మే16 : మైనార్టీ సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ సర్కారు పెద్ద పీట వేస్తుందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. సోమవారం సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం కానుకుంట గ్రామశివారులోని మైనార్టీ స్మశానవాటికకు రూ.10 లక్షల నిధులతో ప్రహరీగోడ నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ అన్ని వర్గాల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నారన్నారు.
రంజాన్ పర్వదినానికి పేద మైనార్టీలకు దుస్తులు, పేద ఆడబిడ్డల వివాహాలకు షాదీ ముబారక్ పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. ఈద్గాలకు, మసీదుల నిర్మాణాలకు కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రహరీ గోడ కోసం ఎమ్మెల్యే తనవంతు సాయంగా రూ.5 లక్షలను అందజేస్తానని హామీనిచ్చారు.
కార్యక్రమంలో ఎంపీపీ సద్ది ప్రవీణా రెడ్డి, జడ్పీటీసీ కుమార్గౌడ్, వైస్ ఎంపీపీ మంజుల, సర్పంచ్ గోవర్ధన్రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహ్మద్హుస్సేన్, సీనియర్ నాయకులు గోవర్దన్రెడ్డి, నరేందర్రెడ్డి, ఆలేటి శ్రీనివాస్రెడ్డి, పీ.వేణు, కుమ్మరి వెంకటేశ్, నక్క వెంకటేశ్గౌడ్, కో ఆప్షన్ మెంబర్ సర్వర్, తదితరులు పాల్గొన్నారు.