సంగారెడ్డి: గంజాయి విక్రయాలపై నిఘా ఏర్పాటు చేయాలని సంగారెడ్డి జిల్లా ఎస్పీ ఎం.రమణకుమార్ సూచించారు. బుధవారం సంగారెడ్డిలోని పోలీసు కల్యాణ మండపంలో శాంతి భద్రతలు, నేరాల అదుపునకు తీసుకుంటున్న చర్యలు, కేసుల పరిశోధన, పెండింగ్ కేసులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గంజాయి కేసులను తీవ్రంగా పరిగణించాలని, దాన్ని విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
కోర్టులో ఉన్న పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. నమోదైన కేసులలో సాక్షుల యొక్క స్టేట్మెంట్ను సంబంధిత కోర్టు ద్వారా సాధ్యమైనంత తొందరగా తీసుకోవాలని, ఆలస్యం చేయడం వల్ల సాక్షులు సాక్ష్యాన్ని మార్చి చెప్పే అవకాశం ఉంటుందన్నారు. సమస్యలు లేని చిన్న కేసులు, పిటీషనర్ల విచారణను ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుళ్లకు ఇవ్వాలని, దీని ద్వారా ఎస్హెచ్ఓలు ముఖ్యమైన కేసులపై ఎక్కువ దృష్టి పెట్టడానికి అవకాశం లభిస్తుందన్నారు. కేసుల కన్విన్షన్ రేటు పెంచడం కోసం కోర్టు కానిస్టేబుల్ పనితీరుపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించాలని సూచించారు.
పెండింగ్లో వారెంట్లను త్వరగా అమలు చేయాలన్నారు. ఏ కేసులో అయిన సూర్యాస్తమయం తరువాత మహిళలను అరెస్టు చేయకూడదని, ఎవరైనా మహిళను పగటు అరెస్టు చేస్తే వెంటనే రిమాండ్కు తరలించాలని అధికారులను ఆదేశిం చారు. పోలీసు స్టేసన్లో ఉన్న రికార్డుల నిర్వహణకు సంబంధించిన 5 ఎస్ సిస్టమ్ను అన్ని పోలీసు స్టేషన్లలో తప్పనిసరి గా అములచేయాలని సూచించారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ కె.సృజన, డీఎస్పీలు సత్యనారాయణరాజు, శంకర్రా జు, భీమ్రెడ్డి, బాలాజీ, డీసీఆర్బీ సీఐ రామకృష్ణారెడ్డి, ఎస్బీ సీఐ మహేష్గౌడ్, అన్ని సబ్డివిజన్ల సీఐలు పాల్గొన్నారు.