సదాశివపేట : ఆషాఢ మాసం శుక్రవారం చివరి రోజు కావడంతో ఆర్థిక మంత్రి హరీశ్రావు దుర్గభవాని పూజల్లో పాల్గొన్నారు. సదాశివపేట పట్టణంలోని దుర్గభవాని ఆలయంలో నిర్వహించిన పూజ కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ కమిటీ అధ్యక్షుడు నాగరాజుగౌడ్ మంత్రిని శాలువా కప్పి సన్మానించారు. ఆలయ అభివృద్ధికి నిధులు కేటాయించాలని వినతి పత్రం అందజేశారు.
కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, డీసీసీబీ చైర్మన్ శివకుమార్, తాసీల్దార్ ఆశాజ్యోతి, కమిషనర్ కృష్ణారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ జయమ్మ, వైస్ చైర్మన్ చింతా గోపాల్, కౌన్సిలర్లు పిల్లోడి విశ్వనాథం, ఆకుల శివకుమార్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు చీల మల్లన్న, ప్రధాన కార్యదర్శి ఎరోళ్ల చిన్న, ఆత్మ కమిటీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, సంగారెడ్డి పట్టణ ప్రధాన కార్యదర్శి పెరుమాండ్ల నర్సింహులు, ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షుడు ప్రవీన్కుమార్, జలేందర్రావు , సదాశివపేట ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు తుల్జారాం ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.