హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 31 (నమస్తే తెలంగాణ): ఆబ్కారీ శాఖలో సీఐ పోస్టింగుల కోసం పెద్ద ఎత్తున లాబీయింగ్ నడుస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పారదర్శకంగానే పోస్టింగులు ఇస్తున్నామని సంబంధిత అధికారులు చెప్తున్నప్పటికీ వాస్తవాలు అందు కు పూర్తి భిన్నంగా ఉన్నాయని, ఆ పోస్టులను వేలం వేస్తున్నారని సొంత శాఖలోనే అసంతృప్తి జ్వాలలు ఎగసిపడుతున్నాయి. ఇటీవల డీసీ లు, ఈఎస్లు, కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్ల బదిలీలు, పోస్టింగుల్లోనూ అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు ఇంకా మరుగున పడలేదు. ఇప్పుడు ఇన్స్పెక్టర్ల బదిలీల్లోనూ అవకతవకలు జరుగుతున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతుండటం ఆబ్కారీ శాఖలో హాట్టాపిక్గా మారింది. ప్రస్తుతం ఎస్సైలు, సీఐలు, ఏఈఎస్ల బదిలీల వ్యవహారంలో ఓ యూనియన్ నాయకుడు, ఓ రిటైర్డ్ అధికారి పెద్ద ఎత్తున పైరవీలు చేస్తున్నట్టు సమాచారం. భారీ డిమాండ్ ఉన్న క్యూర్ పరిధితోపాటు సంగారెడ్డి జిల్లాలోని ఎక్సైజ్ ఠాణాల్లో పోస్టింగుల కోసం వారు లా బీయిండ్ నడుపుతున్నట్టు తెలుస్తున్నది.
సాధారణంగా బదిలీల సమయం లో ఫోకల్ పోస్టింగ్ల కోసం ఎవరికివారు పయత్నాలు చేస్తుంటారు. అమాత్యుల అండదండలు, ధనబలం ఉన్నవారు తాము కోరుకున్న పోస్టింగులను ప్రత్యేక చానల్ ద్వారా పొందేందుకు లాబీయింగ్లు చేయడం చూస్తుం టాం. కానీ, ప్రస్తుతం ఆబ్కారీ శాఖలో ఎవరికివారు కాకుండా 13 మంది కలిసి ప్యాకేజీ రూపంలో రూ.3 కోట్లకు ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా సీఐ పోస్టింగులను దక్కించుకునేందు కు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఈ డీల్ను ఓ యూనియన్ నాయకుడు సెట్ చేసినట్టు తెలుస్తున్నది. ఆ యూనియన్లో సభ్యత్వమున్న కొందరు సీఐలతోపాటు 2005, 2007, 2013 బ్యాచ్లకు చెందిన మరికొందరు సీఐ లు ఈ ప్యాకేజీలో ఉన్నట్టు వినికిడి. ఉద్యోగ విమరణ పొందిన ఓ అధికారి మధ్యవర్తిత్వం ద్వారా మంత్రి పేషీలో చక్రం తిప్పే మరో అధికారితో కలిసి ఈ ప్యాకేజీని సెట్ చేసినట్టు సమాచారం.
ఈ డీల్లో కీలక పాత్ర పోషించిన యూనియన్ నాయకుడు సైబరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ విభాగంలో పోస్టింగ్ కోసం, మిగిలిన 12 మంది సీఐలు సంగారెడ్డి, క్యూర్ పరిధిలోని ఎక్సైజ్ స్టేషన్లు, ఇతర విభాగాల్లో పోస్టింగ్ల కోసం ఒప్పందాలు కుదుర్చుకున్నట్టు తెలిసింది. క్యూర్ పరిధిలోని పలు ఎక్సైజ్ స్టేషన్లు పునర్వ్యవస్థీకరణకు గురికావడంతో ఆయా స్టేషన్లలో పోస్టింగులకు డిమాండ్ గతం కంటే కొంత తగ్గింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అందరూ సంగారెడ్డి జిల్లా పరిధిలోని పోస్టింగులకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నట్టు సమాచారం.