సంగారెడ్డి : టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే గ్రామాలు అభివృద్ధి చెందాయని నారాయణఖేడ్ ఎమ్మెల్యే ఎం.భూపాల్రెడ్డి అన్నారు. సోమవారం సిర్గాపూర్లో వివిధ అభివృద్ధి పనులకు ఎంపీపీ మహిపాల్రెడ్డి తో పాటు ఆయన శంఖుస్థాపన చేశారు. స్థానికంగా ముస్లింల ఖబ్రస్తాన్కు ప్రహరీ కోసం ప్రత్యేక నిధుల కింద రూ.10లక్షల నిధులు, ఎస్సీ కాలనీలో రూ.3లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం, అదే విధంగా సింగార్బొగడ తండాలో రూ.4లక్షలతో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. గతంలో ఎన్నడు లేనివిధంగా అధిక నిధులు కేటాయిస్తూ అభివృద్ధి చేస్తున్నారని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ, స్థానిక సర్పంచ్ జంగం స్వప్న, ఎంపీటీసీ పీరప్ప, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సంజీవరావు, నాయకులు శ్రీనివాస్పాటీల్, యాదవరావుపాటిల్, యూత్ నాయకులు నర్సాగౌడ్ , రమేష్ తదితరులు పాల్గొన్నారు.