జిన్నారం, జూన్ 28 : అభివృద్ధి, సంక్షేమం ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. పటాన్చెరు నియోజకవర్గంలోని గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికతో పనిచేస్తున్నామన్నారు. మంగళవారం అండూరు గ్రామంలో రూ.53లక్షలతో చేపట్టిన సీసీ రోడ్లను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ ఖదీర్, టీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. ఆర్అండ్బీ రోడ్డు నుంచి మిజాజీగూడెం, అండూరు వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. యువత దేశానికి వెన్నుముక అని, పెడదారులు పట్టకుండా వృత్తి నైపుణ్యాలను పెంచుకోవాలన్నారు.
జీఎంఆర్ ఫౌండేషన్ ద్వారా నియోజకవర్గంలోని 500 మంది అభ్యర్థులకు రూ. కోటి వ్యయంతో ఉచిత పోలీస్ శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాలలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ఇచ్చే నిధులతో పాటు పరిశ్రమలు, వివిధ సంస్థల సహకారంతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో జడ్పీవైస్ చైర్మన్ ప్రభాకర్, ఎంపీపీ రవీందర్గౌడ్, ఎంపీటీసీ స్వాతి, సర్పంచ్లు ప్రకాశంచారి, ఆంజనేయులు, శెట్టి శివరాజ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజేశ్, మండల కోఆప్షన్ సభ్యుడు ఇంతియాజ్,తదితరులు పాల్గొన్నారు.