నారాయణఖేడ్, జనవరి 12 : నారాయణఖేడ్ ఎస్బీఐ బ్రాంచ్లో ఓ ఉద్యోగి కరోనా బారిన పడడంతో బుధవారం బ్యాంకు సేవలు నిలిపివేశారు. సదరు ఉద్యోగికి కరోనా లక్షణాలు ఉండడంతో కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్గా తేలింది.
దీంతో బ్రాంచ్ కార్యాలయాన్ని శానిటైజ్ చేసే నిమిత్తం బుధవారం బ్యాంకు సేవలు నిలిపివేసినట్లు బ్రాంచ్ మేనేజర్ మిలింద్ కామ్లే తెలిపారు. గురువారం రోజు యధావిధిగా బ్యాంకు సేవలు కొనసాగుతాయన్నారు.
ఇదిలా ఉండగా ఉద్యోగికి కరోనా కారణంగా బ్రాంచ్ మూసివేసిన విషయం తెలియని వినియోగదారులు బ్యాంకుకు వచ్చి వెనుదిరగడం కనిపించింది.