రామచంద్రాపురం, అక్టోబర్7 : అభివృద్ధి విషయంలో రాజీపడకుండా ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పనిచేస్తున్నామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. గురువారం ఆర్సీపురం డివిజన్లోని మళ్లికార్జుననగర్, కాకతీయనగర్లతో పాటు పలు కాలనీల్లో రూ.2కోట్లతో చేపట్టనున్న అంతర్గత డ్రైనేజీ పనులను డివిజన్ కార్పొరేటర్ పుష్పానగేశ్తో కలిసి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకుసాగుతున్నామని తెలిపారు. కాలనీల్లో ప్రజలకు ఎలాంటి సమస్యలు రాకుండా అంతర్గత డ్రైనేజీలైన్లు, సీసీ రోడ్లను పునరుద్ధరిస్తు అభివృద్ధి చేస్తామన్నారు. పటాన్చెరు నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతు ముందుకు దూసుకుపోతుందని పేర్కొన్నారు.
కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు ఆటూరి గోవింద్, ప్రధానకార్యదర్శి బేకుయాదయ్య, సర్కిల్ అధ్యక్షుడు పరమేశ్, మాజీ కార్పొరేటర్ అంజయ్య, నాయకులు లక్ష్మారెడ్డి, రఘురాంరెడ్డి, ప్రీతిగౌడ్, శ్రీపతిరవీందర్ తదితరులు పాల్గొన్నారు.