నాగల్గిద్దా: నారాయణఖేడ్ నియోజకవర్గానికి వరప్రదాయిని అయిన బసవేశ్వర ఎత్తిపోతల పథకం నిర్మాణానికి సీఎం కేసీఆర్ ప్రభుత్వం రూ.1774 కోట్ల నిధులకు పరిపాలనా అనుమతులు ఇస్తూ జీవోనెంబర్ 37ను జారీ చేయడాన్ని హర్షిస్తూ శుక్రవారం మండల కేంద్రంలోని ఎంపీపీ కార్యాలయ ఆవరణలో సీఎం కేసీఆర్ , మంత్రి హరీశ్రావు, ఎంపీ బీబీపాటిల్ , ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఫ్లెక్సీకి ఎంపీపీ మోతీబాయి, టీఆర్ఎస్ మండల నాయకులు క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు సంజీవ్రెడ్డి, సర్పంచ్లు సురేశ్ , విఠల్, రాజు, రేణుకారాజు పాటిల్ , టీఆర్ఎస్ నాయకులు శిరోమణి, బాలాజీ, లక్ష్మణ్, నర్సింలు తదితరులు ఉన్నారు.