కోహీర్, సెప్టెబంర్13 : కోహీర్ మండలం సిద్దాపూర్ సమీపంలో సోమవారం రాత్రి రెండు వాహనాలు ఢీకొన్న సంఘటనలో ఓ వ్యక్తి మృత్యువాతపడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం..కుంచారం మండలంలోని బోనస్పూర్ గ్రామానికి చెందిన ధనరాజ్(28) మరో మహిళ పుణ్యమ్మతో కలిసి బైక్పై జహీరాబాద్ వైపునకు వస్తుండగా..వారి బైక్ను అతివేగంతో ఎదురుగా వచ్చిన తుఫాన్ వాహనం ఢీకొంది.
దీంతో ధన్రాజ్ తలకు తీవ్రగాయాలు కావడంతో సంఘటన స్థలంలోనే చనిపోయాడు.
గాయాలైన పుణ్యమ్మను చికిత్స కోసం సంగారెడ్డి దవాఖానకు తరలించారు. ధన్రాజ్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. అతడి తండ్రి బస్వరాజ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్సై బ్రహ్మచారి తెలిపారు.