నారాయణఖేడ్, జనవరి 12 : పతంగి ఆట ఆ బాలుడి ప్రాణాలను బలితీసుకుంది. మంగళవారం సాయంత్రం సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలోని దత్తాత్రేయ కాలనీలో విద్యుత్ వైర్లపై పడిన పతంగిని తీసేందుకు ప్రయత్నించి ముగ్గురు చిన్నారులు విద్యుత్ షాక్కు గురై తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే.
కాగా, గాయపడిన ముగ్గురు చిన్నారుల్లో లోకేష్(12) పరిస్థితి విషమంగా ఉండడంతో అతడిని హైదరాబాద్ ఉస్మానియా దవాఖానకు తరలించగా మిగతా ఇద్దరిని బీదర్కు తరలించారు. అయితే ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన లోకేష్ ఉస్మానియా దవాఖానలో చికిత్స పొందుతూ మంగళవారం అర్ధరాత్రి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
చిన్నారి లోకేష్ మృతితో తల్లిదండ్రులు సావిత్రి, సాయిలుతో పాటు బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. అనుకోని పరిస్థితుల్లో ముగ్గురు చిన్నారులు గాయపడి అందులో ఒకరు మృతి చెందడంతో కాలనీలో విషాదఛాయలు అలముకున్నాయి.