అమీన్పూర్ : సంగారెడ్డి జిల్లాలో భారీగా రేషన్ బియ్యం పట్టుబడ్డాయి. అక్రమంగా లారీల్లో తరలిస్తున్న 90 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు సీజ్ చేశారు. జహీరాబాద్ మీదుగా ఇతర రాష్ట్రాలకు పీడీఎస్ బియ్యం తరలిస్తున్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. ఈ మేరకు నిఘాపెట్టి పోలీసులు జహీరాబాద్ శివారులో వాహన తనిఖీలు చేపట్టారు. మూడు లారీల్లో బియ్యాన్ని తరలిస్తున్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. బియ్యంతోపాటు లారీలను సీజ్ చేసి పౌరసరఫరాల శాఖ అధికారులకు అప్పగించారు. బియ్యాన్ని హైదరాబాద్ నుంచి గుజరాత్కు తరలిస్తున్నట్లు విచారణలో గుర్తించామని అధికారులు తెలిపారు.