సంగారెడ్డి ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు
జహీరాబాద్, ఆగస్టు 5: రైతులు ఉద్యాన పంటలు సాగు చేసేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సంగారెడ్డి ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు రాహుల్ విశ్వకర్మ, ఉద్యాన శాస్త్రవేత్త సరిత తెలిపారు. గురువారం జహీరాబాద్ మండలంలోని రంజోల్ గ్రా మంలో రైతులు సాగు చేస్తున్న ఉద్యాన పంటలను పరిశీలించి, పలు సూచనలు చేశారు. రైతులు ఉద్యాన పంటలైన మామిడి, జామ, సీతాఫలం పంటలు పరిశీలించి సూక్ష్మ ధాతు మిశ్రమం అయిన ఆర్కా మ్యాంగో స్పెషల్ గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలన్నారు. నత్రజని, భాస్వరం, పొటాష్ వంటి ఎరువులు అందించడంతో మంచి దిగుబడులు వస్తాయన్నారు. రైతులు పచ్చిరొట్ట ఎరువులు సాగు చేసి భూమిలో దున్ని వేయాలన్నారు. జహీరాబాద్ శివారులో కంది పంట సాగును పరిశీలించి పలు సూచనలు చేశారు. కంది లో అధిక దిగుబడులు సాధించేందుకు కొమ్మలను కత్తిరింపు చేయాలన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఏఈవో ప్రదీప్కుమార్, ఆత్మ ఏటీఎం అజ్మత్ పాషా, రైతు వెంకట్రెడ్డి, అరుణ్శాస్త్రి, శ్రీనివాస్రెడ్డి, గోపాల్ ఉన్నారు.