పుల్కల్ రూరల్, జూలై 24 : మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ముక్కోటి వృక్షార్చన కార్యక్రమం విజయవంతమైనదని ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. శనివారం మండల పరిధిలోని కోడూరు, గొంగ్లూర్ గ్రామాల్లో ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ పర్యటించి మొక్కలు నాటారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితిల్లో మొక్కలు నాటాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. నాటిన ప్రతి మొక్కనూ కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ప్రతి గ్రామంలో నర్సరీలు, పల్లె ప్రకృతి వనాలను అధికారులు ఎప్పటికప్పుడు సందర్శించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో మధులత, ఏపీవో సంతోశ్కుమార్, టీఆర్ఎస్ నాయకులు మఠం భిక్షపతి, విజయ్కుమార్, ఆయా గ్రామాల సర్పంచ్లు పాల్గొన్నారు.
ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలి
చౌటకూర్, జూలై 24 : మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని శనివారం ముక్కోటి వృక్షార్చనలో భాగంగా ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ మండల కేంద్రంలోని ప్రధాన రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతిఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు. చౌటకూర్ మండల కేంద్రంలోని పోలీస్స్టేషన్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని యువకులు ఎమ్మెల్యేను కలిసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ కిష్టయ్య, ఎంపీడీవో మధులత, ఉప తహసీల్దార్ మహేశ్కుమార్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు భిక్షపతి, ఉమ్మడి మండల అధ్యక్షుడు శివకుమార్, సర్పంచ్ వీరమణి మొగులయ్య, ఇటిక్యాల్ సర్పంచ్ మన్నె రాధయ్య, ఏపీవో సంతోశ్కుమార్, పంచాయతీ కార్యదర్శి ఆశలత, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
రాష్ర్టాభివృద్ధి ప్రదాత మంత్రి కేటీఆర్
న్యాల్కల్, జూలై 24 : అభివృద్ధికి మార్గదర్శిగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నిలిచారని మండల టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు అన్నారు. మంత్రి కేటీఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం మండల కేంద్రమైన న్యాల్కల్, హద్నూర్, కల్బేమల్, టేకూర్, మల్గి, గంగ్వార్, హుస్సేల్లి, రేజింతల్ తదితర గ్రామాల్లో పార్టీ శ్రేణులు మొక్కలు నాటారు. మండలంలోని న్యాల్కల్ ఎంపీడీవో, టేకూర్, గంగ్వార్ గ్రామాల్లో కేక్ కట్ చేసి మంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అంజమ్మ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నర్సింహారెడ్డి, వైస్ ఎంపీపీ గౌసొద్దీన్, ఎంపీడీవో జగదీశ్వర్, సూపరింటెండెంట్ రాజశేఖర్, పంచాయతీ అధికారి శ్రీనివాస్రావు, ఈజీఎస్ ఏపీవో రంగారావు, ఆయా గ్రామాల సర్పంచ్లు అమీర్, మల్లారెడ్డి, మారుతీయాదవ్, మహిపాల్, కుత్బుద్దీన్, శంకరయ్యస్వామి, ఉపసర్పంచ్ షబ్బీర్ఖాన్, నాయకులు నిరంజన్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, శ్రీనివాస్, సంతోశ్కుమార్, బక్కారెడ్డి, మునిరొద్దీన్, మక్సుద్, సిద్దారెడ్డి, పంచాయతీ కార్యదర్శులు నాగభూషణం, ప్రవీణ్కుమార్, సుధాకర్గౌడ్ పాల్గొన్నారు.
కంగ్టిలో..
కంగ్టి, జూలై 24 : మండల కేంద్రమైన కంగ్టితోపాటు బోర్గి, రాంతీర్థ్, తడ్కల్ తదితర గ్రామాల్లో మంత్రి కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తడ్కల్లో ఎంపీపీ సంగీతావెంకట్రెడ్డి మొక్కలు నాటారు. రాంతీర్థ్లో ఎంపీటీసీ సందీప్పాటిల్ కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకొన్నారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు కోట ఆంజనేయులు, ఆత్మకమిటీ డైరెక్టర్ రమేశ్ పాల్గొన్నారు.
ఆర్థిక సాయం అందజేత..
అందోల్, జూలై 24 : మంత్రి కేటీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యదర్శి మఠం భిక్షపతి శనివారం నిరుపేదలకు రూ.10 వేల చొప్పున నాలుగు కుటుంబాలకు రూ.40 వేల ఆర్థికసాయం అందజేశారు. ఆయన వెంట ఎంపీపీ బాలయ్య, రాష్ట్ర మార్క్ ఫెడ్ డైరెక్టర్ జగన్మోహన్రెడ్డి, కో-ఆప్షన్ సభ్యుడు ఫైజల్ తదితరులు పాల్గొన్నారు.
నాగల్గిద్ద/మనూరులో..
నాగల్గిద్ద/మనూరు, జూలై 24 : మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా శనివారం ముక్కోటి వృక్షార్చనలో భాగంగా మండలంలోని ఆయ గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎంపీపీ మోతీబాయి, టీఆర్ఎస్ నాయకులు నందుపాటిల్ తదితరులు పాల్గొన్నారు.
ఝరాసంగంలో..
ఝరాసంగం, జూలై 24 : రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని శనివారం కేతకీ సంగమేశ్వరస్వామి దేవాలయంలో ఆలయ ఈవో మోహన్రెడ్డి, ఆలయ సిబ్బంది ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మొక్కలు నాటి నీరు పోశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎంపీడీవో సుజాత, డాక్టర్ మాజీద్తో కలిసి మొక్కలు నాటారు. మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రజాప్రతినిధులు మొక్కలు నాటి వాటికి నీరు పోశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ విజేందర్రెడ్డి ఏపీవో రాజ్కుమార్, గ్రామాల సర్పంచ్లు నాయకులు పాల్గొన్నారు.
నారాయణఖేడ్లో..
నారాయణఖేడ్, జూలై 24 : మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని శనివారం ముక్కోటి వృక్షార్చనలో భాగంగా నారాయణఖేడ్ మండలంలోని అన్ని గ్రామాల్లో మొక్కలు నాటారు. పట్టణంలోని ఏరియా దవాఖానలో ఆరోగ్య ఉపకేంద్రం ఆవరణలో మున్సిపల్ పాలకవర్గం ఆధ్వర్యంలో డీఎంహెచ్వో గాయత్రీదేవి పాల్గొని మొక్కలు నాటారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మల్లారెడ్డి, మాజీ సర్పంచ్ నజీబ్, మున్సిపల్ వైస్ చైర్మన్ పరశురామ్, కౌన్సిలర్లు అబ్దుల్ మాజీద్, నర్సింహులు పాల్గొన్నారు.
రాయికోడ్లో..
రాయికోడ్, జూలై 24 : టీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పుట్టిన రోజును ఘనంగా నిర్వహించారు. శనివారం మండల కేంద్రమైన రాయికోడ్లో ముక్కోటి వృక్షార్చనలో భాగంగా జడ్పీ ఫోరం అధ్యక్షుడు మల్లికార్జున్పాటిల్, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు ప్రభాకర్రెడ్డి మొక్కలు నాటారు. కార్యక్రమంలోఎంపీడీవో వెంకటేశం, ఎంపీవో శ్రీకాంత్గౌడ్, మండల ఉపాధిహామీ అధికారి విష్ణు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బస్వరాజుపాటిల్, వరం వైస్ చైర్మన్ తుకారం, టీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి నాజీంపాటిల్, ఆత్మ కమిటీ చైర్మన్ విఠల్, నాయకులు అశోక్, ఇస్మాయిల్పాటిల్, సుభాశ్రెడ్డి ఉన్నారు.
మునిపల్లిలో..
మునిపల్లి, జూలై 24 : మొక్కలు నాటి గాలికి వదిలేయ్యకుండా ప్రతి మొక్కనూ బతికిద్దామని మునిపల్లి ఎంపీపీ శైలజాశివశంకర్ అన్నారు. మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా మండలంలోని ఆయా గ్రామాల్లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మునిపల్లి మండలంలో 30 వేల మొక్కలు నాటామని తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో సర్పంచ్లు, ఎంపీటీసీలు, గ్రామ కార్యదర్శులు పాల్గొన్నారు.
మంత్రి కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు
కల్హేర్, జూలై 24 : మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ముక్కోటి వృక్షార్చన కార్యక్రమం నిర్వహించామని ఎమ్మెల్యే భూపాల్రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా నాగదర్ నుంచి నిజాంపేట్ వెళ్లే రోడ్డు మార్గంలో ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన మూడు వరుసల్లో 5 వేల మొక్కలు నాటారు. మండలంలోని 26 గ్రామ పంచాయతీల్లో ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు మొక్కలు నాటారని తెలిపారు.
మొక్కలు నాటి సంరక్షించాలి
జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు
జహీరాబాద్, జూలై 24 : పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు సూచించారు. మంత్రి కేటీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని జహీరాబాద్ పట్టణంలోని ఐడీఎస్ఎంటీ కాలనీ, మైనార్టీ బాలికల గురుకుల పాఠశాలలో ఎమ్మెల్యే మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆకుపచ్చ తెలంగాణే లక్ష్యంగా సీఎం కేసీఆర్ హరితహారాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, మున్సిపల్ కమిషనర్ జానకీరామ్సాగర్, టీఆర్ఎస్ నాయకులు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.