సంగారెడ్డి కలెక్టరేట్, జూలై 27: భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉం డాలని సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లో జిల్లా అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, రాజర్షి షాతో కలిసి అధికారులతో కలెక్టర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలపై ఇరిగేషన్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. సిం గూరు, మంజీరా ప్రాజెక్టు, నల్లవాగు, జిల్లాలోని పెద్ద చెరువులను నీటి పారుదల శాఖ అధికారులు పరిశీలించాలన్నారు. జిల్లా అధికారులు గ్రామాల్లో రోడ్లు, చెరువులు, కాల్వలు, కూలిన ఇండ్లు, పంట పొలాలు, పశువులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి నివేదిక ఇవ్వాలన్నారు. కూలడానికి సిద్ధంగా ఉన్న పాఠశాలలను పరిశీలించాలని జిల్లా విద్యాశాఖ అధికారిని ఆదేశించారు. సమావేశంలో నీటి పారుదల శాఖ అధికారులు, ఇంజినీర్లు పాల్గొన్నారు.
రైతుబీమా సొమ్మును వెంటనే జమ చేయాలి
సంగారెడ్డి కలెక్టరేట్, జూలై 27: జిల్లాలో మరణించిన రైతు కుటుంబాలకు రైతుబీమా క్లయిమ్లను నాలుగు రోజుల్లో పరిశీలించి నామినీ ఖా తాల్లో సొమ్మును జమ చేయాలని కలెక్టర్ శరత్ వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో మండలస్థాయి వ్యవసాయ శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతుబీమా సొమ్మును జమ చేయడంలో అలసత్వం చేయవద్దన్నారు. రైతుబంధు పోర్టల్లో రైతుల వివరాలను నమోదు చేయాలన్నారు. ఎరువుల సరఫరా, అమ్మకాలను ఈ-పాస్లో మాత్రమే నిర్వహించాలని, వీటిలో ఎక్కడైనా తేడాలు ఉంటే సంబంధిత ఎరువుల డీలరుపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పీఏం కిసాన్ పోర్టల్లో ఈ కేవైసీని ఈ నెల 31లోగా పూర్తి చేయాలని సూచించారు. పంట రుణాలను ఆగస్టు 15లోగా శాతం పూర్తి చేయాలన్నారు. బాగా పని చేసి లక్ష్యాలను సాధించిన వారికి ప్రోత్సాహకాలు ఉంటాయని కలెక్టర్ తెలిపారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నర్సింహరావు, ఉద్యానవన అధికారి సునీత, సహాయ, మండల స్థాయి వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.