సంగారెడ్డి కలెక్టరేట్, జనవరి 18: జిల్లాలో చేపడుతున్న ప్రభుత్వ ప్రధాన కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, లక్ష్యం మేరకు చిత్తశుద్ధితో పని చేయాలని సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి పంచాయతీ శాఖ అధికారులకు కలెక్టర్ దిశా నిర్దేశం చేశా రు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో 100శాతం పన్ను వసూలు జరగాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉంటున్న ఎంపీవోలు, కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని డీపీవోను ఆదేశించా రు. అదే విధంగా సంబంధిత డీఎల్పీవోలను సంజాయిషీ కోరాలని స్పష్టం చేశారు. పారిశుధ్య నిర్వహణ నిరంతరం సక్రమంగా జరుగాలన్నారు. గ్రామ పంచాయతీ నుంచి అందిస్తున్న పౌర సేవలపై పంచాయతీ కార్యదర్శులకు పూర్తి అవగాహన ఉండాలన్నారు.
డెత్, బర్త్ తదితర సర్టిఫికెట్ల జారీ సక్రమంగా నిర్ణీత సమయంలో ఆన్లైన్లో అప్లోడ్ చేసి సంబంధితులకు అందజేయాలన్నారు. తడి పొడి చెత్త సేకరణ, సెగ్రిగేషన్ జరుగాలని, ఎరువు అమ్మకంతో గ్రామ పంచాయతీలకు ఆదాయం సమకూరాలని తెలిపారు. ప్రతి శుక్రవారం వాటరింగ్ డేను విధిగా పాటించాలన్నారు. వైకుంఠధామాలు, వైకుంఠ రథాలు వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. ప్రతి క్లస్టర్లో వైకుం ఠ రథం, బాడీ ఫ్రీజర్ అందుబాటులో ఉంచాలని, ఎంపీవోలు, పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. ఈజీఎస్ లేబర్, మొబిలైజేషన్ జరుగాలన్నారు. లేబర్ పేమెం ట్ సక్రమంగా జనరేట్ చేసి లేబర్కు పే స్లిప్ ఇవ్వాలని సూచించారు. ఎఫ్టీవోలు ఎప్పటికపుడు జనరేట్ చేయాలన్నారు. యాక్టీవ్ లేబర్లో 50శాతం కన్నా తక్కువ లేబర్ మొబిలైజేషన్ ఉన్నైట్టెతే ఆయా పంచాయతీ కార్యదర్శి, ఫీల్డ్ అసిస్టేంట్లపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఉపా ధి హామీలో చేపట్టనున్న పనులకు సంబంధించి అవసరమైన పనులను గుర్తించాలన్నారు. ఎంపీడీవోలు, ఎంపీవోలు పూర్తి సమన్వయంతో పని చేయాలన్నారు. ఈజీఎస్ జాబ్ కార్డ్స్కు ఆధార్ సీడింగ్ జరగాలని కలెక్టర్ స్పష్టం చేశారు. నర్సరీలు 100శాతం పూర్తి కావాలని, రానున్న హరితహారానికి సంబంధించి లక్ష్యం మేరకు ప్రణాళిక చేసుకోవాలని వివరించారు. గ్రామ పంచాయతీ నివేదిను వారంలోగా పంపాలని, గ్రామ పంచాయతీలో లేటేస్ట్ నివేధికను ప్రదర్శించాలని కార్యదర్శులను ఆదేశించారు. తెలంగాణ క్రీడా ప్రాంగణాలన్ని కాంపోనెంట్స్తో పూర్తి చేసి అందుబాటులోకి వచ్చేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ టెలీ కాన్ఫరెన్స్లో జిల్లా అదనపు కలెక్టర్ రాజర్షీ షా, డీపీవో సురేశ్ మోహన్, డీఆర్డీవో శ్రీనివాసరావు, డీఎల్పీవోలు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.