సిద్దిపేట టౌన్, జూలై 31: అసాధ్యాలను సుసాధ్యం చేయడం సీఎం కేసీఆర్కు ముందు నుంచి అలవాటు. ప్రజల ఆక్షాంక్షలను నెరవేర్చి చిరకాల స్వప్నాన్ని తెలంగాణ సాధించి నిరూపించారు.ప్రజల కలలను నిజం చేస్తూ బంగారు తెలంగాణ ధ్యేయమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. ఎన్నో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్న సీఎం కేసీఆర్ సోమవారం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ క్యాబినెట్ ఆమోద ముద్రవేసింది.
సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయంలో సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతున్న ది.సిద్దిపేట జిల్లాలో దుబ్బాక, సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్లో పనిచేసే ఆర్టీసీ కార్మికులు 900 వందలకు పైగా ప్రభుత్వం ఆమోదంలో ఉద్యోగులుగా మారనున్నారు. ఆర్టీసీ కార్మికుల కుటుంబాల్లో సంబురాలు మిన్నంటాయి.సీఎం కేసీఆర్కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.