చిన్నకోడూర్, జూన్ 6 : అసంపూర్తి రోడ్లతో ప్రజలు, ప్రయాణికులు నరకం అనుభవిస్తున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో డబుల్ రోడ్డు విస్తరణ పనుల మధ్యలోనే నిలిచిపోయాయి. సిద్దిపేట జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లాల ప్రజలను కలిపే ప్రధాన రహదారి కావడంతో ఈ రోడ్డు వెంబడి ప్రతిరోజు వందలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. రోడ్డు విస్తరణ పనులు మధ్యలోనే నిలిపివేయడంతో ప్రజ లు ,ప్రయాణికులు ప్రమాదాల బారిన పడుతున్నారు. సంబంధిత అధికారులు ఇటువైపు కన్నెత్తి చూడటం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
సిద్దిపేట ఎల్లమ్మ దేవాలయం నుంచి ఇల్లంతకుంట వరకు బీఆర్ఎస్ హయాంలో అప్పటి మంత్రి తన్నీరు హరీశ్రావు ప్రత్యేక దృష్టిసారించి సింగిల్ రోడ్డును నాలుగు వరుసల రోడ్డుగా మార్చేందుకు నిధులు మంజూరు చేయించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పు డు ఈ రోడ్డు విస్తరణ పనులు వేగంగా సాగా యి. సిద్దిపేటలోని ఎల్లమ్మ ఆలయం నుంచి చిన్నకోడూరు మండలం పెద్దకోడూర్ వరకు రోడ్డు విస్తరణ పనులు బీఆర్ఎస్ హయాంలో వేగంగా జరగగా, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే అసంపూర్తిగా నిలిచిపోయాయి. దీంతో అకడకడ రోడ్డుపైన కంకరతో తేలి గుంతల మయంగా మారింది.
దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ రోడ్డు వెంబడి సంబంధిత అధికారులు మండల కేంద్రానికి వెళ్తున్నప్పటికీ ఏనాడు పట్టించుకున్న పాపాన పోలేదని ప్రజలు ఆవేదన వ్య క్తం చేస్తున్నారు. ప్రభుత్వం రావడంతోనే రోడ్డు విస్తరణ పనులు నిలిచిపోయాయని పలువురు ఆరోపిస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి అసంపూర్తి పనులు పూర్తి చేసి ప్రయాణం సాఫీగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో రోడ్డు విస్తరణ పనులు వేగంగా జరిగాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే రోడ్డు పనులన్నీ ఎకడికకడే ఆగిపోయినై. రెండున్నర ఏండ్ల నుంచి ఈ రోడ్డు మీదనే రాకపోకలు సాగిస్తున్న. ఎక్కడి పనులు అక్కడనే ఉన్నయి. తీవ్ర ఇబ్బందులు పడుతున్నం. పెండింగ్ రోడ్డు పనులు తొందరగా చేయాలి.
-వానరాసి కనకయ్య, పెద్దకోడూరు(సిద్దిపేట జిల్లా)
రోడ్లు మంచిగ ఉంటేనే ప్రయాణం సాఫీగా సాగుతుంది. గుంతలుగా మారి కంకర తేలి రోడ్డు నరకంగా మారింది. దీంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. అత్యవసర సమయాల్లో ఈ రోడ్డుమీద వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులకు గురవుతు న్నాము. రోజు ఎకడ ఒకచోట ప్రమాదాలు జరుగుతు న్నాయి. అధికా రులు స్పందించి పనులు పూర్తి చేయాలి.
-గాజుల శ్రీహరి, మాచాపూర్ (సిద్దిపేట జిల్లా)