మెదక్ మున్సిపాలిటీ, ఆగస్టు 8ః ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న రేషన్ డీలర్ల కలను సీఎం కేసీఆర్ నెరవేర్చారని జిల్లా రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు ఆనంద్కుమార్ మంగళవారం హర్షం వ్యక్తం చేశారు. రేషన్ డీలర్ల కమీషన్ను రూ. 70 నుంచి రూ.140కి పెంచడం హర్షణీయమన్నారు. అలాగే డీలర్లకు రూ. 5 లక్షల బీమా, ప్రమాదవశాత్తు చనిపోతే రూ. 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించడం అభినందనీయమని అన్నారు.
ప్రతి ఎమ్ఎల్ఎస్ పాయింట్ గోదాంల వద్ద వే బ్రిడ్జిల ఏర్పాటు, లైసెన్స్ రెండు సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు పెంచాలని ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అనంతరం సీఎం కేసీఆర్, మంత్రులు, రేషన్ డీలర్ల రాష్ట్ర గౌరవ అధ్యక్షురాలు పద్మాదేవేందర్రెడ్డికి జిల్లా రేషన్ డీలర్ల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.