నేడు ప్రారంభించనున్న మంత్రులు హరీశ్రావు, నిరంజన్రెడ్డి
రైతులకు మరింత సౌలభ్యం
అన్ని ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు
గజ్వేల్లో రేక్పాయింట్ను ప్రారంభిం చేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. సోమవారం ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు, వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ప్రారంభించ నున్నారు. మెదక్ ఎంపీ, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కొత్త ప్రభాకర్రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి హాజరుకానున్నారు. ఇందుకోసం గజ్వేల్ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు.
గజ్వేల్ రూరల్, జూన్ 26 : గజ్వేల్ ప్రాంత రైతులకు ప్రభుత్వం మరిన్ని సేవలను అందుబాటులోకి తేనున్నది. రైతాంగం పండించిన ధాన్యానికి సరైన మద్దతు ధర చెల్లిం చి అండగా నిలవడమే కాకుండా రైతులకు సరిపడా ఎరువులు, వ్యవసాయ ఆధారిత వస్తువులను మరింత దరిచేర్చడానికి కొత్తగా నిర్మించిన రైల్వేలైన్ మార్గం రేక్పాయింట్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నది. విశాలమైన రింగ్రోడ్డు, రైల్వే సదుపాయం, ఇంటిగ్రేటెడ్ భవన సదుపాయం, అర్బన్పార్కు, క్రీడాప్రాంగణం, ఎడ్యుకేషన్హబ్, ఆర్ఆర్కాలనీలకు వేలాదికోట్ల వ్యయంతో నిర్మించిన నూతన నిర్మాణాలు గజ్వేల్కు మణిహారంలా నిలిచాయి. తాజాగా దేశంలోనే ఎక్కడా లేనివిధంగా రేక్పాయింట్ను ఏర్పాటు చేసి రైతులకు మరింత ఉపలబ్ధంమయ్యేలా చేయడం గజ్వేల్ దేశంలోనే కీర్తికిరీటం కానున్నది. గూడ్స్ రైలు ద్వారా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఎరువులతోపాటు వ్యవసాయ ఆధారిత వస్తువులను గజ్వేల్ రేక్పాయింట్కు తరలించి రైతులకు అండగా నిలువడంతో పరిసర ప్రాంతాల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
నేడు ప్రారంభించనున్న మంత్రులు
గజ్వేల్ రైల్వే కేంద్రంగా ఏర్పాటు చేస్తున్న రేక్పాయింట్ ప్రారంభానికి ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు, వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి హాజరుకానున్నారు. ఇందుకోసం గజ్వేల్ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు.