సిద్దిపేట : బఉధ బుధవారం మధ్యాహ్నం కురిసిన అకాల వర్షానికి ఉమ్మడి మెదక్ జిల్లాల్లోని పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. సిద్దిపేట జిల్లాలోని తోగుట, మిరుదొడ్డి, దుబ్బాక మండలాలతో పాటు పలు ప్రాంతాల్లో కురిసిన వర్షానికి పంట పొలాలు, మామిడి తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ మండలాల్లో ధాన్యం సేకరణ కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యం వర్షపు నీటిలో తడిసింది. అదేవిధంగా మెదక్, సంగారెడ్డి జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో కురిసిన వర్షానికి వరి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.