అందోల్, జూలై 28: అందోల్ గడ్డపై ఎగిరేది గులాబీ జెండానేనని, ప్రతి పక్షాలు ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఈసారి డిపాజిట్లు కూడా రావని ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. శుక్రవారం అందోల్లోని క్యాం ప్ కార్యాలయంలో రాయికోడ్ మండలం మాటూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు మంగళి అశోక్, బ్యాగరి దత్తు, కేశవ్కుమార్ తదితరులు బీఆర్ఎస్లో చేరగా ఎమ్మెల్యే వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు.
తెలంగాణలో బీఆర్ఎస్కు తప్ప, మరే పార్టీకి చోటులేదన్నారు. సీఎం కేసీఆర్ సారధ్యంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నదన్నారు. పార్టీ నాయకులు కలిసి మెలిసి పనిచేయాలన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ అభివృద్ధి పనులు ప్రజలకు వివరిస్తూ, పార్టీని మరింత బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాలన్నారు. సీఎం రిలీఫ్ఫండ్ పథకం పేదవారికి అండగా ఉన్నదన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికీ దీని ద్వారా మెరుగైన వ్యైద్యం అందుతున్నదన్నారు. అందోల్లోని క్యాంప్ కార్యాలయంలో రాయికోడ్ మండలం మాటూర్ గ్రామానికి చెందిన మొల్ల ఖదీర్కు రూ.4.40 లక్షల చెక్కును ఎమ్మెల్యే అందజేశారు.