మెదక్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): హరితహారం కార్యక్రమం కింద చేపట్టిన నర్సరీల్లో మట్టితో నింపిన బ్యాగులు సిద్ధం చేసి మొకలు పెంచాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. బుధవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో మండల పరిషత్ అధికారులు తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, ఆర్డీవోలు, డీఆర్డీవో, పంచాయత్ రాజ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పంచాయతీలకు నిర్దేశించిన లక్ష్యం మేరకు నర్సరీల్లో నాణ్యమైన విత్తనాలు వాడి, మొకల పెంపకం చేపట్టాలని అధికారులకు సూచించారు.
పచ్చదనం ఫరిడవిల్లేలా ఎండిపోయిన మొకల స్థానంలో పెద్ద మొకలు నాటాలన్నారు. మండల అధికారులు గ్రామ స్థాయిలో అభివృద్ధి పనులను నిరంతరం పర్యవేక్షిస్తూ నిర్దేశిత గడువులోగా పనులు పూర్తయ్యేలా చూడాలన్నారు. బృహత్ పల్లె ప్రకృతి వనాలకు, తెలంగాణా క్రీడా ప్రాంగణాలకు స్థలాలు గుర్తిం చి వెంటనే కేటాయించాలని ఆదేశించారు. పంచాయతీల్లో పారిశుధ్య కార్యక్రమాలు సమర్థవంతగా నిర్వహించాలన్నారు. ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులను ప్రగతిని ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయిలో పరిశీలించి, వేగవంతంగా పూర్తయ్యేలా చూడాలన్నారు. ఈజీఎస్ మార్గదర్శకాల మేరకు కూలీలకు ఉపాధి పనులు కల్పించాలని సూచించారు.
వైద్య శాఖలో మెడికల్ ఆఫీసర్ల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
వైద్య శాఖలో ఆయుష్, హోమియో, యునానీ, నూట్రోపతి పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని మెదక్ కలెక్టర్ రాజర్షి షా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నేషనల్ హెల్త్ మిషన్ ఆధ్వర్యంలో ఈ పోస్టులు భర్తీ చేయనున్నట్టు పేర్కొన్నారు. ఆయుర్వేద పోస్టులు 7 మంజూరు కాగా, అందులో ఐదుగురు మెడికల్ ఆఫీసర్లు ఉన్నారని, మరో రెండు పోస్టులు భర్తీ చేయనున్నారు.
యునానీలో రెండు పోస్టులు మంజూరు కాగా, ఒక మెడికల్ ఆఫీసర్ ఉండగా, మరో పోస్టును భర్తీ చేస్తామని పేర్కొన్నారు. హోమియోపతిలో 5 పోస్టులు మంజూరు కాగా, ఇద్దరు మెడికల్ ఆఫీసర్లు పనిచేస్తున్నారని, మూడు పోస్టులు భర్తీ చేయనున్నారు. మొత్తంగా 6 పోస్టులకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ నెల 20వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవాలని, 22 నుంచి 27 వరకు స్క్రూట్నీ ఉంటుందని, 26న ప్రొవిజినల్ మెరిట్ లిస్ట్ ఏర్పాటు చేస్తామని, మార్చి 6న మెరిట్ లిస్ట్తో పాటు సెలక్షన్ లిస్ట్ వేస్తామని తెలిపారు. మార్చి 8న కౌన్సెలింగ్ చేసి ఎంపికైన అభ్యర్థులకు ఆర్డర్ కాపీలు అందజేస్తామని తెలిపారు.
మెదక్ కలెక్టర్గా బాధ్యతల స్వీకరణ
మెదక్ జిల్లా నూతన కలెక్టర్గా రాజర్షి షా బుధవారం మెదక్ కలెక్టరేట్లోని చాంబర్లో పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ను కలిసి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ మొక్క అందజేశారు. డీఎంహెచ్వో చందునాయక్, డీపీవో సాయిబాబా, సీపీవో ఖాసిం, పశుసంవర్ధక శాఖ అధికారి విజయ శేఖర్రెడ్డి, పరిశ్రమల శాఖ అధికారి కృష్ణమూర్తి, డీఎస్వో శ్రీనివాస్, వ్యవసాయ శాఖ అధికారి ఆశాకుమారి, డీఎస్డీవో విజయలక్ష్మి, మహిళా శిశు సంక్షేమ అధికారి బ్రహ్మాజీ, మెప్మా పీడీ ఇం దిర, బీసీ సంక్షేమ అధికారి కేశురాం, డీపీఆర్వో శాంతికుమార్ కలెక్టర్ను కలిశారు.