పెద్దశంకరంపేట,డిసెంబర్22 : ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి అన్నారు. బుధవారం పెద్దశంకరంపేట పట్టణంలోని శ్రీ వేంకటేశ్వర ఆలయంలో మండల సర్పంచ్లఫోరం అధ్యక్షుడు కుంట్ల రాములు అన్న కూతరు వివాహనికి హాజరై వధూ వరులను ఆశీర్వదించిన అనంతరం లబ్ధిదారులకి సీఎం రిలీఫ్ పండ్ చెక్కులు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిందన్నారు. ప్రజలు వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ జంగం శ్రీనివాస్, మండల టీఆర్ఎస్ అధ్యక్షులు మురళీపంతులు, మండల సర్పంచ్లఫోరం అధ్యక్షుడు కుంట్ల రాములు, మండల రైతుబంధు అధ్యక్షుడు సురేష్గౌడ్, నాయకులు రవీందర్, పున్నయ్య, తదితరులున్నారు.