హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ): అభ్యుదయ రచనలతో తెలంగాణ ఆత్మగౌరవాన్ని చాటిచెప్పిన దాశరథి కృష్ణమాచార్య మార్గం మనందరికీ స్ఫూర్తిదాయకమని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో బుధవారం దాశరథి జయంత్యుత్సవాలను నిర్వహించారు.
దాశరథి చిత్రప టానికి నేతలతో కలిసి నివాళులర్పిం చారు. అనంతరం తలసాని మాట్లాడు తూ సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు ఎదుర్కొన్న వివక్షను దాశరథి తన రచనల ద్వారా కండ్లకు కట్టారని కొనియాడారు. దాశరథి ఆశయ సాధనకు కృషి చే స్తున్నామని నేతలు చెప్పారు.