జహీరాబాద్, నవంబర్ 23: జహీరాబాద్ లో సీఎం కేసీఆర్ నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభ సక్సెస్ కావడంతో గులాబీ శ్రేణుల్లో జోష్ వచ్చింది. సీఎం కేసీఆర్ సభకు భారీగా ప్రజలు తరలిరావడంతో నాయకులకు, కార్యకర్తలో ఉత్సాహం కనిపించింది. నియోజకవర్గంలోని జహీరాబాద్ మండలం, పట్టణంతో పాటు మొగుడంపల్లి, న్యాల్కల్, ఝరాసం గం, కోహీర్ మండలం నుంచి భారీ సంఖ్యలో మహిళలు తరలివచ్చిరు. ఎమ్మెల్యే మాణిక్రావు, బీఆర్ఎస్ అభ్యర్థి కొనింటి మాణిక్రావును భారీ మోజార్టీతో గెలిపించండి.. మీ సమస్యలు నేనూ, మంత్రి హరీశ్రావు పరిష్కా రం చేస్తామన్నారు. నియోజకవర్గంలో ఉన్న లక్ష ఎకరాలకు కాళేశ్వరం నీటిని అందిస్తామని ప్రకటించడంతో ప్రజలు సంతోషంగా వ్యక్తం చేశారు. ప్రతి ఇంటికి అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు. గిరిజన మహిళలు, రైతులు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభకు ప్రజలు భారీగా రావడంతో మాణిక్రావు గెలుపు ఖాయమని తెలిసిపోయింది. వికారాబాద్లో చెల్లని రూపాయి..
జహీరాబాద్లో చెల్లుతుం దా అని ప్రజలను ప్రశ్నంచారు. కాంగ్రెస్ అభ్యర్థి ఎలాంటి వ్యక్తిలో ఆలోచన చేసిన ఓట్లు వేయాలని కోరారు. సీఎం సభ ఏర్పాట్లును ఎమ్మెల్యే మాణిక్రావు, రాష్ట్ర బేవరేజేస్ కార్పొరేషన్ మాజీ చైర్మ న్, నియోజకవర్గ ఎన్నికల ఇన్చైర్జ్జి దేవీప్రసాద్రావు, ఉమ్మడి జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ పర్యవేక్షణ చేశారు. టెలికం బోర్డు సభ్యులు, నియోజకవర్గ గిరిజన తండాల ఇన్చార్జి పవార్ శంకర్నాయక్ సీఎం కేసీఆర్కు సేవాలాల్ చిత్రపటం అందజేసి సన్మానం చేశారు. ఈ ప్రజా ఆశీర్వద సభలో జహీరాబాద్ ఎంపీ బీబీపాటిల్, ఎమ్మెల్యే మాణిక్రావు, మాజీ శాసనసభాపతి మధుసుదనాచారి, రాష్ట్ర బేవరేజేస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి దేవీప్రసాద్రావు, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నరోత్తం, టీఎస్ఐడీ చైర్మన్ తన్వీర్, ఉమ్మడి జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ మాల్కాపురం శివకుమార్, సీడీసీ చైర్మన్ ఉమాకాంత్పాటిల్, రైల్వే బోర్డు సభ్యులు షేక్ ఫరీదు, ఆత్మకమిటీ చైర్మన్ పెంటారెడ్డి, టెలికం బోర్డు సభ్యుడు పవార్ శంకర్నాయక్, జడ్పీటీసీలు స్వప్నాభాస్కర్, వినీలానరేశ్, న్యాల్కల్ ఎంపీపీ అంజమ్మ, బీఆర్ఎస్ నాయకులు విజయ్మోహన్రెడ్డి, గుం డప్ప, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు సయ్యద్ మోహినొద్దీన్, తట్టు నారాయణ, నర్సింహులు, వెంకటేశం, రవీందర్, శ్రీనివాస్రెడ్డి, మహిళా నాయకులు సరస్వతిరెడ్డి, అనుషామ్మ, మంజూల, శీలారమేశ్ పాల్గొన్నారు.
జహీరాబాద్ ప్రాంతం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎంతో అభివృద్ధి సాధించిందని ఎంపీ బీబీపాటిల్ అన్నారు. ఈ పదేండ్లలో నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులతో పాటు సమస్యలను పరిష్కరించామని చెప్పా రు. అన్నివర్గాల సంక్షేమం కోసం బీఆర్ఎస్ పార్టీ మంచి మ్యానిఫెస్టోను విడుదల చేసిందన్నారు. ఈనెల 30న జరగనున్న పోలింగ్లో కారుగుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి మాణిక్రావును భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. మాణిక్రావు గెలుపుతో నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందన్నారు.
జహీరాబాద్ మండలంలోని కొత్తూర్(బి) గ్రామంలో ఉన్న నారింజ ప్రాజెక్టును పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే మాణిక్రావు కోరారు. ప్రాజెక్టును పర్యటక ప్రాంతంగా అభివృద్ధి చేసి వ్యవసాయనికి సాగునీరు అందించాలన్నారు. జహీరాబాద్లో మహిళా డిగ్రీ గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేయాలని కోరారు. మూడుసార్లు జహీరాబాద్ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడంపై ఎప్పుడూ సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటానన్నారు. 2014 నుంచి నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేశామన్నారు. తెలంగాణ సరిహద్దులో ఉన్న కర్ణాటక గ్రామాల ప్రజలు తెలంగాణలో కలుపుకోవాలని కోరుతున్నారని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి కట్టుబడి ఉన్నదన్నారు.