మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థిగా మూడోసారి బరిలో ఉన్న ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డికి మెదక్ పట్టణంలోని 20, 22, 23, 24, 25 వార్డుల్లో ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది. ఈ సందర్భంగా మళ్లీ నీవే గెలవాలి, మెదక్ మరింత అభివృద్ధి చెందాలి అంటూ తమ ఆడబిడ్డగా ఇండ్లలోకి తీసుకెళ్లి, పసుపు, కుంకుమ అందజేశారు. తామంతా పద్మాదేవేందర్రెడ్డి వెనుకనే ఉంటామని ఘంటాపథంగా తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం పట్టణంలోని పలు వార్డుల్లో ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం చేశారు.
మెదక్ అర్బన్, నవంబర్ 10: తెలంగాణ ప్రభుత్వంలోనే మెదక్ పట్టణం అభివృద్ధి చెందిందని, పదేండ్ల క్రితం మెదక్ పట్టణం పల్లెను తలపించేదిగా ఉండేదని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం మెదక్ పట్టణంలోని వేంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం 20, 22, 23, 24, 25 వార్డుల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్రెడ్డి మాట్లాడుతూ.. పదేండ్ల కిందట మెదక్ పట్టణం రోడ్లు, మురుగు కాల్వలు సరిగ్గా లేక మెదక్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత మెదక్ పట్టణంలో సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు నిర్మించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మెదక్ బహిరంగ సభలో మెదక్ మున్సిపాలిటీకి రూ.50 కోట్ల మంజూరు చేశారని, అ నిధులతో పట్టణంలో మరిన్ని అభివృద్ధి పనులు చేసేలా ప్రణాళికలు చేశామని పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. పట్టణంలో ఇంటింటికీ మంచినీళ్లను అందించిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలో మెదక్ పట్టణంలో నీటి కష్టలు ఉండేవని, నీటి కోసం బిందెలతో రోడ్డుపై బైఠాయించేవాళ్లమన్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి మెదక్లో లేదన్నారు. కాంగ్రెస్కు ఓటు వేస్తే కరెంట్ కష్టాలు వస్తాయని పేర్కొన్నారు. కార్ణాటక పరిస్థితే తెలంగాణలో ఏర్పాటు అవుతుందన్నారు.
బీఆర్ఎస్ అభ్యర్థిగా శాసనసభ ఎన్నికల్లో మూడోసారి పోటీ చేస్తున్న ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డికి మెదక్ పట్టణంలో ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం పట్టణంలోని పలు వార్డుల్లో ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ప్రజలు పద్మాదేవేందర్రెడ్డిని అప్యాయంగా పలకరిస్తూ.. మళ్లీ నీవే గెలవాలి, మెదక్ మరింత అభివృద్ధి చెందాలి అంటూ ఆడబిడ్డగా తమ ఇళ్లలోకి తీసుకెళ్లి పసుపు, కుంకుమ అందజేశారు. ఓ హోటల్లో పూరీలు వేసి, బట్టలు ఇస్త్రీ చేసి, కుట్టుమిషన్పై బట్టలు కుడుతూ ఓటు వేయాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాతే కులవృత్తులపై ఆధారపడి జీవించేవారి బతుకులు మెరుగయ్యాయన్నారు. 10 ఏండ్ల క్రితం మెదక్ అభివృద్ధి ఏ స్థితిలో ఉందో.. ప్రస్తుతం ఏ విధంగా అభివృద్ధి చెందిందో గుర్తించి తనకు ఓటేయాలని అభ్యర్థించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. తనను గెలిపిస్తే మెదక్ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానన్నారు. ప్రచారంలో మెదక్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గంగాధర్, వార్డు కౌన్సిలర్లు నర్వ లక్ష్మీనారాయణగౌడ్, నిర్మల, చందన, సుమన్, కృష్ణారెడ్డి, నాయకులు చంద్రకళ, రాగి అశోక్ తదితరులు పాల్గొన్నారు.