వట్పల్లి, జనవరి 30 : తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ అన్నారు. మండలంలోని బీజిలిపూర్ గ్రామానికి చెందిన వడ్డెర సంఘం నాయకులు, కాంగ్రెస్ నేతలు సోమవారం ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కష్టపడి పనిచేసే వారికి పార్టీలో ఎల్లప్పుడూ సముచిత స్థానం లభిస్తుందని, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పద్మారావు, బీఆర్ఎస్ నాయకులు సదానందం, మల్లేశం, శాబొద్దీన్ తదితరులు పాల్గొన్నారు.