జిల్లాల్లో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ప్రజలు గురువారం ఊరూరా ఘనంగా నిర్వహించుకున్నారు. రా జ్యాంగాన్ని రచించి భారతదేశానికి దిశానిర్దేశం చేసిన మహానీయుడు అంబేద్కర్ అని అదనపు ఎస్పీ బాలస్వామి అన్నా రు. జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని ఆదేశానుసారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో 74వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని జాతీయజెండాను ఆవిష్కరించారు. మెదక్ కోర్టు లో సీనియర్ సివిల్ జడ్జి జితేందర్ విద్యార్థులకు బహమతులు అందజేశారు. మెదక్ వ్యవసాయ కార్యాలయంలో ఏడీ విజయనిర్మల, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
ప్రభుత్వం సంక్షేమాభివృద్ధికి కృషి చేస్తున్నదని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి పేర్కొన్నారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. పెద్దశంకరంపేటలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మురళీపంతులు, ఎమ్మెల్యే భూపాల్రెడ్డితో కలిసి ఆవిష్కరించారు. రామాయంపేట పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద చైర్మన్ జితేందర్గౌడ్ జాతీయ జెండాను ఆవిష్కరిం చారు. నిజాంపేటలో ఎంపీపీ సిద్ధిరాములు, డిప్యూటీ తహసీల్దార్ గంగాప్రసాద్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.
తూప్రాన్లో ఆర్డీవో శ్యాంప్రకాశ్, మున్సిపల్ కమిషనర్ మోహన్, డీఎస్పీ యాదగిరి రెడ్డి, ఎంపీడీవో అరుంధతి, తహసీల్దార్ జ్ఞానజ్యోతి తమ కార్యాలయాల్లో జాతీయజెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
– మెదక్ జిల్లా నెట్వర్క్, జవనరి 26