నర్సాపూర్/కొల్చారం/శివ్వంపేట, జనవరి 30 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రెండో విడుత కంటివెలుగుతో ప్రజలు కొత్త వెలుగులు చూస్తున్నారని ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నారు. సోమవారం శివ్వంపేట మండలంలోని పెద్దగొట్టిముక్ల గ్రామంలో సర్పంచ్ చంద్రకళశ్రీశైలంయాదవ్, నర్సాపూర్ మున్సిపల్ పరిధిలోని 14వ వార్డులో, కొల్చారం మండలంలోని కోనాపూర్లో ఎంపీపీ మంజుల కాశీనాథ్తో కలిసి కంటివెలుగు క్యాంపు ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ కంటివెలుగు కార్యక్రమం వందరోజుల పాటు నిర్వహించడం జరుగుతుందని, 18సంవత్సరాలు పైబడిన ప్రతీ ఒక్కరూ ఉచితంగా కంటి పరిక్షలు చేయించుకోవాలని సూచించారు. అవసరమైన వారికి అద్దాల పంపిణీతోపాటు ఉచిత ఆపరేషన్లు చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, ఎంపీపీ కల్లూరి హరికృష్ణ, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు మన్సూర్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రమణాగౌడ్, సర్పంచ్లు నాయకులు పాల్గొన్నారు.
కంటి వెలుగును సద్వినియోగం చేసుకోవాలి
చిన్నశంకరంపేట, జనవరి 30 : ప్రభుత్వం ఏర్పాటు చేసిన కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ ఆవుల భాగ్యలక్ష్మి, సర్పంచ్ బందెళ్ల జ్యోతి అన్నారు. సోమవారం మండలంలోని జంగరాయిలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీడీవో నవీన్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సాయిసింధు నాయకులు పాల్గొన్నారు.
కంటి వెలుగును విజయవంతం చేయండి
రామాయంపేట, జనవరి 30 : కంటి వైద్య శిబిరాన్ని విజయవంతం చేయాలని రామాయంపేట డీఎల్పీవో రాజేంద్రప్రసాద్, ఎంపీడీవో ఉమాదేవి, సర్పంచ్ పంబాల జ్యోతి కోరారు. సోమవారం రామాయంపేట మండలం ఝాన్సిలింగాపూర్లో వైద్య శిబారాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీవో గిరిజారాణి, మాజీ సర్పంచ్ రామకిష్టయ్య, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు నర్సారెడ్డి, ఎంపీటీసీ మద్దూరి జ్యోతి పాల్గొన్నారు.
అంధత్వ నివారణకు కంటి వెలుగు
పెద్దశంకరంపేట, జనవరి 30: అంధత్వ నివారణకు ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమం చేపట్టిందన్నారు. ఈ పథకం ద్వారా అంధత్వ నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డాక్టర్ హర్ష కోరారు. సోమవారం పెద్దశంకరంపేట మండలం దానంపల్లిలో కొనసాగుతున్న కంటి వెలుగు శిబిరాన్ని పరిశీలించారు. రెండో విడత కంటి వెలుగు కార్యక్రమానికి గ్రామాల్లో విశేష స్పందన లభిస్తుందన్నారు.
బస్వాపూర్లో కంటివెలుగు శిబిరం ప్రారంభం
వెల్దుర్తి, జనవరి 30 : కంటివెలుగు శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జడ్పీటీసీ రమేశ్గౌడ్ అన్నా రు. మండలంలోని బస్వాపూర్లో ఏర్పాటు చేసిన రెండోవిడత కంటివెలుగు శిబిరాన్ని ఎంపీడీవో వెంకటలక్ష్మి, సర్పంచ్ మల్లేశంగౌడ్, వెల్దుర్తి ఎంపీటీసీ మోహన్రెడ్డి, డాక్టర్ శిరీషలతో కలిసి ప్రారంభించారు. పరీక్షలు చేయించుకున్న పలువురికి కంటి అద్దాలను అందజేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కృష్ణాగౌడ్, కంటి వెలుగు డాక్టర్ సౌజన్య, ఎంపీహెచ్వో ప్రదీప్ పాల్గొన్నారు.
కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి
చిలిపిచెడ్, జనవరి 30 : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టా త్మకంగా ప్రవేశపెట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని గ్రామ కార్యదర్శి తిరుపతి పేర్కొన్నారు. సోమవారం మండలంలోని చిట్కు ల్ గ్రామంలో కొనసాగుతున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రా మంలోని ప్రజలు కంటి వెలుగు శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్ సృజన, కార్యదర్శి తిరుపతి, సిబ్బంది, ఏఎన్ఎం పద్మ ఉన్నారు.