పటాన్చెరు, జూలై 27: పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డికి పుత్రశోకం కలిగింది. తీవ్ర అనారోగ్యంతో ఎమ్మెల్యే పెద్ద కుమారుడు గూడెం విష్ణువర్ధన్రెడ్డి (35) గురువారం తెల్లవారుజామున మృతి చెందారు. కుమారుడి మరణంతో ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి, ఆయన సతీమణి గూడెం యాదమ్మ తీవ్రంగా రోధించారు. పక్కనున్న బంధువులు, స్నేహితులు, బీఆర్ఎస్ శ్రేణులు కన్నీరుమున్నీరయ్యారు. విష్ణు కన్నుమూసిన వార్తతో వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు హైదరాబాద్లోని కాంటినెంటల్ హాస్పిటల్కు చేరుకుని ఎమ్మెల్యే మహిపాల్రెడ్డిని ఓదార్చే ప్రయత్నం చేశారు. సంతాపం తెలిపారు. విష్ణు మరణవార్తతో ప్రజలు, పార్టీ శ్రేణులు నిర్ఘాంతపోయారు. ఎప్పుడూ చిరునవ్వుతో అందరినీ ఆప్యాయంగా పలకరించే విష్ణువర్ధన్రెడ్డి మరణ వార్తతో ప్రజలు తండోపతండాలుగా పటాన్చెరులోని ఎమ్మెల్యే నివాసానికి తరలివచ్చారు.
విష్ణువర్ధన్రెడ్డి పార్థివదేహాన్ని దవాఖాన నుంచి ఇంటికి తీసుకురాగానే తండ్రి గూడెం మహిపాల్రెడ్డి కొడుకుని చూసి రోదిస్తూ స్ప్రహ తప్పారు. వెంటనే ఎమ్మెల్యేకు ప్రథమ చికిత్స అందించారు. పలుమార్లు కొడుకును గుర్తుచేసుకుంటూ ఎమ్మె ల్యే విలపించడం అందరినీ కలచివేసింది. తల్లి యాద మ్మ, విష్ణు భార్య కిరణ్మయిలను బంధువులు, మహిళలు దర్చలేకపోయారు. విష్ణుకు ఒక కుమారుడు, ఒక కూతురు ఉన్నారు. విష్ణు సోదరుడు విక్రం, చిన్నాన గూడెం మధుసూదన్రెడ్డి మృతదేహాన్ని చూసి కన్నీటిపర్యంతమయ్యారు.
అంత్యక్రియలకు హాజరైన మంత్రులు గూడెం విష్ణువర్ధన్రెడ్డి అంత్యక్రియలకు టీఎస్ఐడీసీ చైర్మన్, మం త్రులు హరీశ్రావు, మహమూద్ అలీ హాజరయ్యారు. మంత్రులతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు తరలివచ్చి ఓదార్చారు. ప్రగాఢ సానుభూతి తెలిపారు. పటాన్చెరు పట్టణంలోని జీఎమ్మార్ కన్వెన్షన్ హాల్ పక్కన ఎమ్మె ల్యే సొంతస్థలంలో అంత్యక్రియలు నిర్వహించా రు. అంత్యక్రియలకు భారీగా ప్రజలు హాజరయ్యారు. కనుచూపుమేర ప్రజలే కనిపించారు. అంత్యక్రియల్లో ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, మహిళా కార్పొరేషన్ చైర్మన్ సునీతాలక్ష్మారెడ్డి, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, టీఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఎమ్మెల్యేలు భూపాల్రెడ్డి, క్రాంతికిరణ్, మదన్రెడ్డి, మాణిక్రావు, పద్మాదేవేందర్రెడ్డి, కలెక్టర్ శరత్, మాజీ ఎమ్మెల్యే లు చింతాప్రభాకర్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
పటాన్చెరు, జూలై 27: కుమారుడు విష్ణువర్ధన్రెడ్డిని కోల్పోయి తీవ్ర విషాధంలో మునిగిపోయిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డిని బీజేపీ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు ఈటెల రాజేందర్ పరామర్శించారు. గురువారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి నివాసంలో ఈటెల రాజేందర్, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్రావుతో కలిసి ఎమ్మెల్యేకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎమ్మెల్యే కుటుంబానికి త్వరగా ఈ విషాదాన్ని అధిగమించే శక్తిని భగవంతుడు ఇవ్వాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు గోదావరి, సి.అంజిరెడ్డి, నాయకులు పాల్గొన్నారు.