సిద్దిపేట అర్బన్, జనవరి 13 : ‘బిడ్డా బాగా చదవి, మంత్రి హరీశ్రావు సార్ నమ్మకం, మా పేరు నిలబెట్టాలి’ అంటూ ఉత్తరం చదివి పదో తరగతి విద్యార్థుల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం నారాయణరావుపేట మండలంలోని గుర్రాలగొంది గ్రామంలో పదో తరగతి విద్యార్థుల ద్వారా మంత్రి హరీశ్రావు పంపిన ఉత్తరాలను అందుకున్న తల్లిదండ్రులు స్థానిక ప్రజాప్రతినిధులతో వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రి హరీశ్రావు మాలో స్ఫూర్తి, ఆత్మవిశ్వాసాన్ని నింపారన్నారు. తమ పిల్లల భవిష్యత్ కోసం తపన పడుతున్న మంత్రి మాటలకు వారు సంతోషం వ్యక్తం చేశారు. గురువు, తండ్రి, అన్న, కొడుకులా మాకు మనోధైర్యం ఇచ్చారని, మా పిల్లల భవిష్యత్కు పునాది వేశారన్నారు. మీరు పంపిన ఉత్తరంతో మా బిడ్డ మంచిగా చదిచి, ఉత్తీర్ణత సాధించి మిమ్మల్ని కలుస్తామని వారు తెలిపారు. ఈ ఉత్తరం ద్వారా తమతో పాటు తమ పిల్లలకూ నూతనోత్సాహం కలిగిందని, మంత్రి హరీశ్రావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.