మూడో రోజూ వేడుకలా పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు
పిచ్చిమొక్కల ఏరివేత, మురుగు కాల్వలు శుభ్రం
వాడవాడల్లో పర్యటించిన అధికారులు, ప్రజాప్రతినిధులు
స్థానిక ప్రజల సమస్యలపై ఆరా..
పారిశుధ్య, అభివృద్ధి పనులను పరిశీలించిన ప్రజాప్రతినిధులు
‘ప్రగతి’లో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపు
నమస్తే తెలంగాణ నెట్వర్క్, జూన్ 5: పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు మూడో రోజూ జిల్లాలో జోరుగా నిర్వహించారు. ఆదివారం అధికారులు, ప్రజాప్రతినిధులు గల్లీ గల్లీలో తిరుగుతూ సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తామని స్థానికులకు హామీ ఇచ్చారు. పలుచోట్ల జరుగుతున్న అభివృద్ధి, పారిశుధ్య పనులను పరిశీలించారు.
డ్రైనేజీల శుభ్రం, వీధులు ఊడవడం, శ్రమదానం వంటి కార్యక్రమాలు చేపట్టారు. నర్సరీలు, పల్లె ప్రకృతివనాలు, వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులను ప్రజాప్రతినిధులు, అధికారులు సందర్శించారు. పల్లె, పట్టణ ప్రగతిలో భాగస్వాములు కావాలని వారు పిలుపునిచ్చారు.
దుబ్బాక: 19వ వార్డులో పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తున్న ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి
కోహెడ: శనిగరంలో ‘పల్లెప్రగతి’ పనులు చేయిస్తున్న సర్పంచ్ జయశ్రీ
సిద్దిపేట అర్బన్: తడ్కపల్లి పల్లె ప్రకృతి వనంలో మొక్కలు నాటుతున్న జడ్పీ చైర్ పర్సన్ రోజాశర్మ
గజ్వేల్ మండలం అక్కారంలో వీధులను శుభ్రం చేస్తున్న ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, చిత్రంలో ఏఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్