ఉత్సాహంగా పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమం
పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు
శ్రమదానంలో పాల్గొన్న ప్రజలు
కొత్తరూపు సంతరించుకుంటున్న పల్లెలు, బస్తీలు
నమస్తే తెలంగాణ నెట్వర్క్, జూన్ 4 : పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమం జిల్లాలో ఉత్సాహంగా కొనసాగుతున్నది. రెండోరోజూ శుక్రవారం జిల్లాలో ప్రతి ఊరు, ప్రతి పట్టణంలో కార్యక్రమాన్ని చేపట్టారు. అధికారులు పర్యవేక్షించగా.. ప్రజాప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొన్నారు. డ్రైనేజీల శుభ్రం, వీధులు ఊడవడం, శ్రమదానం, ర్యాలీలు వంటి పనులు చేపట్టారు.
నర్సరీలు, పల్లె పకృతివనాలు, వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులను ప్రజాప్రతినిధులు, అధికారులు సందర్శించారు. గ్రామాలు, వార్డుల్లో సమస్యలను తెలుసుకొని పరిష్కారానికి చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములవుతున్నారు. పచ్చదనం, పారిశుధ్యం, పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అధికారులు అవగాహన కల్పించారు.
చేర్యాల : చిట్యాల గ్రామంలో శ్రమదానం చేస్తున్న గ్రామస్తులు, పారిశుధ్య సిబ్బంది
జగదేవ్పూర్ : శనివారం మండలంలోని చాట్లపల్లిలో పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలిస్తున్న ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి