జిల్లాలో జోరుగా పల్లె, పట్టణ ప్రగతి
క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారం
శుభ్రంగా వీధులు, కాలనీలు
పనులను పర్యవేక్షిస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులు
జగదేవ్పూర్, రాయపోల్ మండలాల్లో జడ్పీ చైర్పర్సన్ పర్యటన
జిల్లాలో పల్లె, పట్టణ ప్రగతి జోరుగా సాగుతున్నది. అధికారులు, ప్రజాప్రతినిధులు గ్రామాలు, పట్టణాల్లో పర్యటిస్తూ, క్షేత్రస్థాయిలో సమస్యలను గుర్తించి అక్కడికక్కడే పరిష్కరిస్తున్నారు. దీంతో కాలనీలు, వీధులు అద్దంలా మెరుస్తున్నాయి. జగదేవ్పూర్, రాయపోల్ మండలాల్లో జడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ పర్యటించారు. నర్సరీలు, పల్లె ప్రకృతి వనాలను పరిశీలించారు. సీఎం కేసీఆర్ దూరదృష్టి ప్రణాళికలతోనే పల్లెలు పట్టణ సొబగులు అద్దుకుంటున్నాయన్నారు.
జగదేవ్పూర్, జూన్ 17 : సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతితో పల్లెలన్నీ సంపూర్ణ అభివృద్ధి చెంది పట్టణాలను తలపిస్తున్నాయని జడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ అన్నారు. శుక్రవారం జగదేవ్పూర్ మండలం ఇటిక్యాల గ్రామంలో నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి, డీపీవో దేవకీదేవితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. సీఎం కేసీఆర్ దూరదృష్టి ప్రత్యేక ప్రణాళికలతోనే పల్లెలు పచ్చని అందాలతో అందంగా ముస్తబవుతున్నాయన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం విద్య, వైద్యానికి ఎక్కువ మొత్తం లో నిధులు ఖర్చు చేస్తున్నదన్నారు. ‘మనఊరు-మనబడి’ కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలలు అన్ని హంగులతో ముస్తాబవుతున్నాయన్నారు. పేదలకు బస్తీ దవాఖాన లు ఏర్పాటు చేసి మంచి వైద్యం అందిస్తున్నట్లు చెప్పారు. పల్లె ప్రగతితో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాలు పల్లెలకు కొత్త సొబగులు తీసుకరాగా, పల్లెల్లో ఏపుగా పెరిగిన చెట్లు ఆహ్లాదాన్ని పంచుతున్నాయన్నారు. ఇటిక్యాల గ్రామంల పల్లె ప్రకృతివనం, డంపింగ్ యార్డు, నర్సరీ చాలా బాగుందని కితాబిచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్ చంద్రశేఖర్, గజ్వేల్ ఏఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, వైస్ చైర్మన్ ఉపేందర్రెడ్డి, ఎంపీపీ బాలేశంగౌడ్, ఎంపీటీసీ కవిత, డీఎల్పీవో వేదవతి, ప్రత్యేక అధికారి సరోజిని, ఎంపీడీవో పాల్గొన్నారు.
దేశంలోనే ఆదర్శం పల్లె ప్రగతి
రాయపోల్, జూన్ 17: గ్రామాల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం దేశంలోనే ఆదర్శంగా నిలిచిందని జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజాశర్మ అన్నారు. శుక్రవారం రాయపోల్ మండల కేంద్రంలో ఆమె పర్యటించారు. స్థానిక పీహెచ్సీని తనిఖీ చేశారు. రోగులు, వైద్య సిబ్బంది సమస్యలను అడిగి తెలుకున్నారు. అనంతరం పల్లెప్రకృతి వనాన్ని పరిశీలించారు. వివిధ రకాల మొక్కలు ఏపుగా పెరిగి ఆహ్లాదాన్ని పంచుతుండడంతో సర్పంచ్ను అభినందించారు.
సీజనల్ వ్యాధులు దూరం..
దౌల్తాబాద్, జూన్ 17 : పల్లె ప్రగతితో సీజనల్ వ్యాధులు దూరమయ్యాయని రో జాశర్మ పేర్కొన్నారు. శుక్రవారం దౌల్తాబాద్ మండలం శేరిపల్లిబందారంలో పర్యటించా రు. పల్లె ప్రగతిలో భాగంగా పలు అభివృద్ధి పనుల వివరాలను అధికారుల నుంచి తెలు సుకున్నారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కరపత్రాన్ని ఆవిష్కరిం చారు. ప్రగతిలో ప్రతి ఒక్కరూ భాగస్వాము లు కావాలని పిలుపునిచ్చారు. అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనుల ను పూర్తి చేయలన్నారు.