జోరుగా పల్లె, పట్టణ ప్రగతి పనులు
పారిశుధ్యం, పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన
ఇంటింటికీ హరితహారం మొక్కల పంపిణీ
నర్సరీలను పరిశీలించిన అధికారులు
పలువురు పంచాయతీ, మున్సిపల్ కార్మికులకు సన్మానం
నేటితో ముగియనున్న ‘ప్రగతి’
మెదక్/ సంగారెడ్డి నెట్వర్క్ , జూన్ 17 : పల్లె, పట్టణ ప్రగతికి ప్రజలంతా జై కొడుతున్నారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ కార్యక్రమంతో తమ ప్రాంతాలు ఎంతో అభివృద్ధి సాధిస్తున్నాయని హర్షం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం సంగారెడ్డి జడ్పీచైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్రెడ్డి చౌటకూరు మండలంలోని లింగంపల్లి, వెండికోల్,వెంకటకిష్టాపూర్ గ్రామాల్లో పర్యటించారు. నర్సరీ, పల్లెప్రకృతి వనం, పారిశుధ్య పనులు బాగున్నాయంటూ కార్మికులను అభినందించారు. నారాయణఖేడ్ 15వవార్డులో మున్సిపల్ చైర్పర్సన్ రుబీనా నజీబ్ మురికి కాలువలో చెత్తను సిబ్బందితో తొలిగింపజేశారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం రామతీర్థం, మల్లంపేట గ్రామాల్లో పల్లె ప్రకృతి వనం,నర్సరీలు, వైకుంఠధామం, డంపింగ్యార్డులను అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో పంచాయతీ, మున్సిపల్ సిబ్బందిని అధికారులు, ప్రజాప్రతినిధులు ఘనంగా సన్మానించారు.
పట్టణ ప్రగతికి సహకరించాలి
మెదక్ మున్సిపాలిటీ, జూన్ 17 : పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ పిలుపునిచ్చారు. పట్టణ ప్రగతిలో భాగంగా శుక్రవారం 11, 12 వార్డుల్లో పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పట్టణాలు అభివృద్ధ్ది చెందాలనే గొప్ప సంకల్పంతో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించరన్నారు. పట్టణాభివృద్ధికి, పరిశుభ్రతకు ప్రజలు సహకరించాలని సూచించారు. డ్రైనేజీలను, రోడ్ల ను పారిశుధ్య సిబ్బంది ఎప్పటికప్పుడూ శుభ్రం చేస్తున్నారని, ప్రజలు సైతం డ్రైనేజీల్లో, రోడ్లపైనా చెత్త వేయకుండా ఇంటి దగ్గరకు వచ్చిన మున్సిపల్ వాహనానికి తడి, పొడి చెత్త వేర్వేరుగా ఇవ్వాలని సూచించారు. మార్పు అనేది ప్రతి ఒక్కరి నుంచి మొదలు కావాలన్నారు. 11వ వార్డులో కౌన్సిలర్ సమియొద్దీన్తో కలిసి ఎంఎన్ కెనాల్ ఒడ్డున మొక్కలు నాటారు. 12వ వార్డులోని వడ్డెర కాలనీలో క్రీడా ప్రాంగణం నిర్మాణానికి స్థ లాన్ని పరిశీలించారు. పిల్లీకోటాల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు భూమి పూజ చేశారు. కార్యక్రమంలో కమిషనర్ శ్రీహరి, కౌన్సిలర్లు జయరాజ్, లక్ష్మీనారాయణగౌడ్, శ్రీనినవాస్, ఏఎంసీ మాజీ చైర్మన్ మధుసూదన్రావు, డైరెక్టర్ శంకర్, మాజీ డైరెక్టర్ శ్రీనివాస్, నాయకులు పాల్గొన్నారు.
కొనసాగుతున్న పట్టణ ప్రగతి
నర్సాపూర్, జూన్ 17 : నర్సాపూర్ మున్సిపాలిటీలో 4వ విడత పట్టణ ప్రగతి కార్యక్రమం జో రుగా కొనసాగుతుంది. జాతీయ రహదారికి ఇరువైపులా పేరుకుపోయిన ఫ్లాస్టిక్ వ్యర్థ్ధాలను మున్సి పల్ కార్మికులు సేకరించి, శుభ్రం చేశారు. పట్టణ ప్రగతి పనులను మున్సిపల్ చైర్మన్ మురళీయాదవ్, కమిషనర్ చాముండేశ్వరి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజలు ప్ల్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించుకోవాలని సూచించారు. పట్టణ ప్రగతిలో భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ ప్రత్యేకాధి కారులు, మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు.
కార్మికులకు సన్మానం
పారిశుధ్య కార్మికుల సేవలు అమోఘం
జడ్పీ చైర్పర్సన్ హేమలతాశేఖర్గౌడ్
జిల్లావ్యాప్తంగా సన్మానాలు, సత్కారాలు
ఊరూరా కొనసాగుతున్న ‘ప్రగతి’ పనులు
తూప్రాన్: మల్కాపూర్లో పారిశుద్ధ్య కార్మికులను సన్మానిస్తున్న సర్పంచ్ మహాదేవి నవీన్
జిల్లావ్యాప్తంగా పల్లె ప్రగతి పనులను నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా పరిసరాల పరిశుభ్రత, స్వచ్ఛత, పారిశుధ్య పను లు నిర్వహిస్తున్నారు. రోడ్లను శుభ్రపర్చడం, చెత్తాచెదారాన్ని తొలిగించడం, మురుగునీటి కాల్వలను శుభ్రం చేయించడం, ఇండ్లలో లభించే చెత్తను తడి, పొడిగా సేకరించడం, డంపింగ్ యార్డుల్లో చెత్తను వేరు చేయడం, కంపోస్టు ఎరువు తయారీ పనులు చేపడుతున్నారు. పల్లె ప్రగతి పనుల్లో భాగంగా శుక్ర వారం పంచాయతీ, పారిశుధ్య కార్మికులను స్థానిక ప్రజాప్రతి నిధులు, అధికారులు సన్మానించారు. కార్మికుల సేవలను కొనియాడారు. గ్రామాలు స్వచ్ఛతగా తీర్చిదిద్దడంతో కార్మికు ల కృషి ఎనలేనిదని సర్పంచ్లు అభినందించారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుధ్య కార్మికుల శ్రమ అమోఘ మని జడ్పీ చైర్పర్సన్ హేమలతాశేఖర్గౌడ్ అన్నారు.
మనోహరాబాద్ మండలం దండుపల్లిలో పారిశుధ్య కార్మికులను సన్మానించి, నిత్యావసరాలు అందజేశారు. పల్లె ప్రగతితో గ్రా మాలు ప్రగతిబాట పడుతున్నాయని మెదక్ ఆర్డీవో సాయి రాం, ఎంపీడీవో శ్రీరాములు అన్నారు. కార్మికుల కృషి మరు వలేదని రామాయంపేట ఎంపీపీ భిక్షపతి, ఎంపీడీవో యాదగిరిరెడ్డి అన్నారు. వెల్దుర్తి మండలంలో కార్మికులను సన్మానిం చారు. కార్మికుల సేవలు అభినందనీయమని శివ్వంపేట జడ్పీటీసీ మహేశ్గుప్తా అన్నారు. గ్రామాల అభివృద్ధిలో కార్మికుల కృషి ఉన్నదని చేగుంట, నార్సింగి ఎంపీడీవోలు ఉమాదేవి, ఆనంద్మేరి పేర్కొన్నారు.
మనోహరాబాద్ : దండుపల్లిలో కార్మికులకు సరుకులు అందజేస్తున్న జడ్పీ చైర్పర్సన్ హేమలతాగౌడ్
రామాయంపేట : ఆర్.వెంటకటాపూర్లో కార్మికులను సన్మానిస్తున్న సర్పంచ్
వెల్దుర్తిలో కార్మికులను సన్మానిస్తున్న సర్పంచ్, ఎంపీవో