రామాయంపేట/మెదక్ మున్సిపాలిటీ/చిన్నశంకరంపేట /నిజాంపేట, నవంబర్ 25: మెదక్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పద్మాదేవేందర్రెడ్డి లక్ష మెజార్టీతో విజయం సాధిస్తారని ‘ఇఫ్కో’ డైరెక్టర్ దేవేందర్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్గౌడ్, శనివారం పురపాలికలోని యువతతో కలిసి వార్డులతోపాటు వ్యాపార వాణిజ్య సంస్థలు, వివిధ కాలనీల్లో ప్రచారం చేపట్టి క్యాంపు కార్యాలయంలో వారు మాట్లాడారు. రామాయంపేట పట్టణంతో పాటు పలు కాలనీలలో ఉన్న వారంతా కేసీఆర్ బలపర్చిన మెదక్ ఎమ్మెల్యే అభ్యర్థి పద్మాదేవేందర్రెడ్డినే భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, పట్టణ అధ్యక్షుడు గజవాడ నాడగరాజు, పీఏసీఎస్ చైర్మన్ బాదె చంద్రం, బీఆర్ఎస్ నాయకులు పురపాలిక కౌన్సిలర్లు గజంవాడ నాగరాజు, దేమె యాదగిరి, చిలుక గంగాధర్, సుందర్సింగ్, బీఆర్ఎస్ నాయకులు చంద్రపు కొండల్రెడ్డి, ఎస్కే.హైమద్, బాలుగౌడ్, ఐలయ్య, అశోక్, మల్లెశం, యాద శ్రీనువాస్, నవాత్ మహేశ్, రామస్వామిగౌడ్, మర్కు దత్తు తదితరులు ఉన్నారు. గొల్పర్తి గ్రామంలోని కౌన్సిలర్ మల్యాల కవిత కిషన్ అధ్వర్యంలో ఇంటింటి ప్రచారం చేపట్టి ఓటును అభ్యర్థించారు.
* ‘మన ఇంటి పార్టీ బీఆర్ఎస్-మన ఇంటి మనిషి పద్మక్క’ను భారీ మెజార్టీతో గెలిపించాలని బీఆర్ఎస్ మహిళా నేత, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ అంకం చంద్రకళ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని 22, 23వ వార్డుల్లో మహిళా కార్యకర్తలతో కలిసి ఇంటింటికీ ప్రచారం నిర్వహించారు.
* చిన్నశంకరంపేట మండలంలోని అంబాజీపేటలో మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్రెడ్డికి మద్దతుగా శనివారం జడ్పీటీసీ మాధవి ఇంటింటికి బీఆర్ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టోను వివరిస్తూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తు కారు గుర్తు ఓటు వేసి పద్మాదేవేందర్రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
* అన్నివర్గాల సంక్షేమమే సీఎం కేసీఆర్ ప్రధాన లక్ష్యమని వైస్ఎంపీపీ అందె ఇందిరా కొండల్రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని కల్వకుంటలో బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఆమె ఇంటింటికీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ మ్యానిఫెస్టో, ప్రభుత్వ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గ్రామస్తులకు వివరించారు. కారు గుర్తుకు ఓటు వేసి మెదక్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పద్మాదేవేందర్రెడ్డిని గెలిపించాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు చింతల స్వామి, రాము, రమేశ్, నర్సింహులు, పద్మ, లావణ్య గ్రామస్తులు పాల్గొన్నారు.