చిన్నశంకరంపేట, డిసెంబర్ 15: ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని చందంపేటలో నిర్వహిస్తున్న పెద్దమ్మతల్లి ఆలయ వార్షికోత్సవంలో మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. పెద్దమ్మతల్లి కల్యాణమహోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఒడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించున్నారు.
పద్మాదేవేందర్రెడ్డిని ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలశాఖ అధ్యక్షుడు రాజు, లక్ష్మారెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు శివకుమార్, సర్పంచ్ శ్రీలత, శ్రీనివాస్రెడ్డి, మాజీ సర్పంచ్లు, కుమార్గౌడ్, రవీందర్రెడ్డి, నాయకులు హేమావెంకటేశం, సుధాకర్నాయక్, సత్యనారాయణరెడ్డి, మండలంలోని వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.