‘కాంగ్రెస్ ఇచ్చేవన్నీ దొంగ హామీలే, చెప్పేవన్నీ ఝూటా మాటలే. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే కరెంటు కష్టాలు తప్పవు. ఆ పార్టీకి ఓటేస్తే ఆగం కావాల్సిందే’ ..అని మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలవాలని కోరారు. శనివారం మెదక్ మండలంలోని ర్యాలమడుగు, పేరూరు, మాచవరం, మంబోజిపల్లి, హవేళీఘనపూర్, నాగాపూర్ బొగుడబైపతిపూర్, శాలీపేట్, బొగుడభూపతిపూర్ తండా, శాలీపేట్ చౌట్లపల్లి, ఔరంగబాద్ తండా గ్రామాల్లో మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో రైతుబీమా, రైతుబంధు, ఉచిత కరెంటు ఎందుకు అందించడం లేదని ప్రశ్నించారు. 24 గంటలు కరెంటు ఇస్తున్న బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తారో 3 గంటల కరెంటు ఇస్తామంటున్న కాంగ్రెస్కు ఓటు వేస్తారో ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు.
మెదక్ రూరల్ నవంబర్ 25: కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఆగం కావాల్సిందేనని మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలవాలని కోరారు. శనివారం మెదక్ మండలంలోని ర్యాలమడుగు, పేరురూ, మాచవరం, మంబోజిపల్లి, హవేళీఘనపూర్, నాగాపూర్ బొగుడబైపతిపూర్, శాలీపేట్, బొగుడభూపతిపూర్ తండా, శాలీపేట్ చౌట్లపల్లి, ఔరంగబాద్ తండా గ్రామాల్లో మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు భారీ సంఖ్యలో హాజరై పూలు చల్లూతూ స్వాగతం పలికారు. గ్రామంలో ర్యాలీగా వెళ్లి ఇంటింటి ప్రచా రం నిర్వహించారు. శాలువాలు పూలమాలతో ఘనంగా సన్మానించారు. పద్మాదేవేందర్రెడ్డిని మహిళలు ఆడబిడ్డగా ఆదరించి పసుపు కుంకుమ అందజేశారు. ఓటు వేసి తనను గెలిపించాలని పద్మాదేవేందర్రెడ్డి అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ ఇచ్చేవన్నీ దొంగ హామీలేనని, చెప్పేవన్నీ ఝూటా మాటాలేనని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే కరెంటు కష్టాలు తప్పవన్నారు. గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా చేసిన ఘనత సీఎం కేసీఆర్దేనన్నారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో రైతుబీమా, రైతుబంధు, ఉచిత కరెంటు ఎందుకు అందించడం లేదని ప్రశ్నించారు. 24 గంటలు కరెంటు ఇస్తున్న బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తారో 3 గంటల కరెంటు ఇస్తామంటున్న కాంగ్రెస్కు ఓటు వేస్తారో ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే అసైన్డ్ భూము లు రెగ్యులరైజ్ చేస్తామన్నారు. సౌభాగ్యలక్ష్మి పథకంలో అర్హులైన మహిళలకు నెలకు రూ.3వేలు, రూ.400లకే గ్యాస్ సిలిండర్ అందిస్తామన్నారు. ఆసరా పింఛన్లు రూ.5016కు పెంచుతామన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందన్నారు. గతంలో ఎమ్మెల్యేగా గెలిచిన మైనంపల్లి హన్మంత్రావు మెదక్ ప్రజలకు ఏమి చేశారని ప్రశ్నించారు. 13 ఏండ్ల నుంచి ప్రజలకు దూరం ఉండి, ఓట్లప్పుడు వచ్చి ఒక్కసారి అవకాశం ఇవ్వాలని అడుగుతున్నాడని, ఎన్నికలు వస్తున్నాయంటే వచ్చే వాళ్లను నమ్మొద్దన్నారు. మీకు ఎప్పుడూ అందుబాటులో ఉండే మీ బిడ్డ కావాలా , పరాయి వాళ్లు కావాలా, ఒక్కసారి ఆలోచించుకోవాలన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి రోహిత్కు మోటర్కు మీటర్కు తేడా తెలియదన్నారు. మెదక్ నియోజకవర్గ ప్రజల గురించి ఏమి తెలుసన్నారు. పేద ఇంటి ఆడపిల్లలకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతులకు రైతుబంధు, రైతు బీమా, 24 గంటల కరెంట్ తదితర కార్యక్రమాలు, దళితులకు దళితబంధు తదితర వినూత్న పథకాలు చూపెట్టి, దేశానికే రాష్ట్రం ఆదర్శంగా నిలిచేలా కేసీఆర్ చేశారన్నారు. తెల్లరేషన్ కార్డు కలిగిన ప్రతిఒక్కరికీ రూ.5 లక్షల కేసీఆర్ బీమా సౌకర్యాన్ని కల్పిస్తామన్నారు. ఆసరా పింఛన్లు 2024 నుంచి రూ.5016కు పెంచునున్నట్లు తెలిపా రు. కేసీఆర్ పాలనలో కరెంట్ కష్టాలు పోయాయని, చెరువులు బాగు చేసుకోవడంతోపాటు చెక్డ్యామ్లు నిర్మించుకున్నామన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తూ కారు గుర్తుకు ఓటు వేసీ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పద్మాదేవేందర్రెడ్డి ఆధ్వర్యంలో పేరూరులో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలకు చేరారు. వారికి బీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పథకాలకు ఆకర్షితులై బీఆర్ఎస్లోకి వస్తున్నారని వారు పేర్కొన్నారు. ప్రచారంలో జడ్పీ వైస్ చైర్పర్సన్ లావణ్యారెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ అంజాగౌడ్, మెదక్ ఎంపీపీ యమున, హవేళీఘనపూర్ ఎంపీపీ శేరి నారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే శశిధర్రెడ్డి, మెదక్ పీఏసీఎస్ చైర్మన్ చిలుముల హన్మంత్రెడ్డి, మాచవరం పీఏసీఎస్ చైర్మన్ సీతారామయ్య, రైతు బంధు మండల అధ్యక్షుడు కిష్టయ్య సర్పంచ్లు రజని భిక్షపతి, ప్రభాకర్, వెంకటేశం, ఎంపీపిటీసీ మాన సరాములు, నాయకులు నర్సింహారెడ్డి, జయరాంరెడ్డి, సాంబశివరావు, సుబ్బారావు, శ్రీనివాస్, ఏగొండ, యాదాగౌడ్, యాదగిరి, నగేశ్, నర్సిం లు, శ్రీనివాస్, నవీన్, సతీశ్ పాల్గొన్నారు