సీఎం కేసీఆర్ ఆశీస్సులతో మెదక్ నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధిలో ముందుంచానని, మీ ఆడబిడ్డలా నన్ను మరోసారి ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానని మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. మంగళవారం బీఆర్ఎస్ తరఫున ఆమె నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఏడుపాయల వనదుర్గామాత, స్వగ్రామం కోనాపూర్లోని పోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మెదక్ రిటర్నింగ్ కార్యాలయంలో ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, మెదక్ వ్యవసాయ మారెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి, చెల్ల సుధాకర్, జావిద్హుస్సేన్తో కలిసి రెండుసెట్ల నామినేషన్లను దాఖలు చేశారు.
మెదక్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ ఆశీస్సులతో మెదక్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని, ఆడబిడ్డలా తనను మరోసారి ఆశీర్వదించాలని మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి ఎం.పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. మంగళవారం బీఆర్ఎస్ పార్టీ తరఫున నామినేషన్ వేయనున్న సందర్భంగా ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి స్వగ్రామం రామాయంపేట మండలం కోనాపూర్ పోచమ్మ ఆలయంలో, ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గాభవానీ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మెదక్ రిటర్నింగ్ కార్యాలయంలో రెండు సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో నామినేషన్ వేసినట్లు తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో మెదక్ నియోజకవర్గం ప్రజలు తనకు చేదోడు వాదోడుగా నిలిచారన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ ఆశీస్సులతో నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ఇకడి ప్రజల కోరిక మేరకు ముఖ్యమంత్రి ఆశీస్సులతో జిల్లా హెడ్ క్వార్టర్ అయ్యిందన్నారు. వ్యవసాయ రంగాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో సాగునీటి కోసం ఎంఎన్ కెనాల్, ఎఫ్ఎన్ కెనాల్కు లైనింగ్ చేసి పంట పొలాలకు సాగునీరు అందించామన్నారు. మిషన్ కాకతీయతో చెరువులను పునరుద్ధరించినట్లు తెలిపారు. ఎన్నో ఏండ్ల నుంచి కలగానే మిగిలిపోతాయనున్న కార్యక్రమాలు మెదక్ కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం, రైల్వే, మెడికల్ కళాశాలను ఏడు సంవత్సరాల్లో తీసుకొచ్చామన్నారు. నియోజకవర్గంలో ఎకడికి వెళ్లినా ఆడబిడ్డలాగా ఆశీర్వదిస్తూన్నారని, ప్రజల దగ్గర నుంచి మంచి స్పందన వస్తున్నదన్నారు. మెదక్ నియోజకవర్గాన్ని ప్రజల ఆశీస్సులతో అభివృద్ధిలో మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా కృషి చేస్తానని పేరొన్నారు. ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి తరఫున మరో నామినేషన్ సెట్ను మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్గౌడ్, మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్రెడ్డి, కౌన్సిలర్ మామిండ్ల ఆంజనేయులు, నాయకులతో కలిసి మెదక్ రిటర్నింగ్ కార్యాలయంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి, వ్యవసాయ మారెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి, చెల్ల సుధాకర్, జావిద్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.
మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్రెడ్డి మంగళవారం ఉదయం 11 గంటలకు నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా మెదక్ నియోజకవర్గంలోని ఆయా గ్రామాల నుంచి పెద్దఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శశిధర్రెడ్డి, మెదక్ నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి కంఠారెడ్డి తిరుపతిరెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ లావణ్యారెడ్డి, మున్సిపల్ చైర్మన్లు చంద్రపాల్, జితేందర్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి, మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్గౌడ్, ఎంపీపీ నారాయణరెడ్డి, బీఆర్ఎస్ మండలాల పార్టీ అధ్యక్షులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దీంతో బీఆర్ఎస్ కార్యాలయం సందడిగా మారింది. ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ప్రతి ఎన్నికల్లోనూ సెంటిమెంట్గా రామాయంపేట మండలం కోనాపూర్ గ్రామంలోని పోచమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి, అనంతరం గ్రామస్తుల మధ్య నామినేషన్ ఫారాన్ని నింపి మెదక్ రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో అందజేశారు.
పాపన్నపేట, నవంబర్7: ఏడుపాయల వనదుర్గా భవానీ మాతను మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి మంగళవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మెదక్ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా నామినేషన్ వేయడానికి ముందు ఆమె దుర్గామాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయడం ఆనవాయితీగా వస్తున్నది. ఈ సందర్భంగా వేద పండితులు ఆమె పేరు మీద ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ చైర్మన్ సత్తెల్లి బాలాగౌడ్ ఆమెకు సన్మానించారు. ఎమ్మెల్యే వెంట ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్రెడ్డి, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు కుమ్మరి జగన్, పాపన్నపేట మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకట్రాంరెడ్డి, ధర్మకర్తలు మనోహర్, మోహన్రావు, నాగ్సాన్పల్లి బీఆర్ఎస్ అధ్యక్షుడు శేఖర్, సాయిరెడ్డి, సామ్యూల్ తదితరులు ఉన్నారు.
రామాయంపేట రూరల్, నవంబర్7: మెదక్ నియోజకవర్గ ప్రజలే నా బలం బలగం, మిమ్మల్ని నమ్మి మరోసారి ముందుకెళ్తున్నా.. అని బీఆర్ఎస్ మెదక్ అభ్యర్థి పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసే ముందు స్వగ్రామం రామాయంపేట మండలంలోని కోనాపూర్ గ్రామంలో కుటుంబీకుల ఆశీర్వాదంతో పాటు గ్రామంలో పోచమ్మ దేవాలయంలో పూజలు చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మెదక్ నియోజకవర్గం నుంచి 21 ఏండ్లుగా రాణించడానికి కోనాపూర్ ప్రజలే కారణమన్నారు. గ్రామ కోడలిని అయినప్పటికీ తనను ఇంటింటా ఆడపడుచులాగా ఆదరించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈసారి కూడా తనను ఎప్పటిలాగే ఆదరించి ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానన్నారు. ఆమెతో ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్రెడ్డి, గ్రామ సర్పంచ్ దోమ చంద్రకళ, ఎంపీపీ నార్సింపేట భిక్షపతి, రామాయంపేట మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి, నాయకులు దోమ ఇమానియేల్ తదితరులు ఉన్నారు.