ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే పంటను విక్రయించాలని, దళారులను నమ్మి మోసపోవద్దని సంగారెడ్డి, మెదక్ జిల్లాల జడ్పీచైర్పర్సన్లు మంజుశ్రీ, హేమలత రైతులకు సూచించారు. సోమవారం చౌటకూరు, పుల్కల్, మనోహరాబాద్ మండలాల పరిధిలోని పలు గ్రామాల్లో వారు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతు సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నదని, సీఎం కేసీఆర్ పాలనలో వ్యవసాయానికి పూర్వవైభవం వచ్చిందన్నారు. ప్రభుత్వం ఏ గ్రేడ్కు రూ.1960, సాధారణ రకానికి రూ.1940 చెల్లిస్తున్నదని తెలిపారు. అన్నదాతలు తెచ్చిన ధాన్యాన్ని వెంటనే ట్యాబ్లో నమోదు చేసి సకాలంలో డబ్బులు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. చివరి గింజ వరకూ సేకరించే బాధ్యత మీదేనని, ఎవరికీ ఇబ్బందులు రాకుండా చూసుకోవాలన్నారు.
పుల్కల్/ చౌటకూర్, మే 9: రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలని సంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్రెడ్డి అన్నారు. సోమవారం పుల్కల్ మండల పరిధిలోని పోచారం, మిన్పూర్, కోడూరు, లక్ష్మీసాగర్, చౌటకూర్ మండల పరిధిలోని పోసాన్పల్లి గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ఆమె ప్రారంభించారు. అనంతరం జడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏ గ్రేడ్ రకం వడ్లకు రూ.1,960, సాధారణ రకం రూ.1,940ను మద్దతు ధర ఇస్తున్నదని, రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. రైతులకు ఎలాంటి సమస్య ఎదురైనా తమ దృష్టికి తీసుకురావాలన్నారు. చివరి గింజ వరకూ ధాన్యం సేకరించాలని అధికారులకు, సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో ఆత్మకమిటీ చైర్మన్ యాదగిరిరెడ్డి, తహసీల్దార్లు పరమేశం, కిష్టయ్య, ఎంపీడీవో మధులత, ఏపీఎం శివలక్ష్మి, ఆర్ఐ యాదగిరి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మాచర్ల విజయ్ కుమార్, సర్పంచ్లు స్వాతి కనకారెడ్డి, నర్సింహారెడ్డి, శ్యామ్రావు, నాయకులు విజయ్భాస్కర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రైతులు దళారులను నమ్మొద్దు
మనోహరాబాద్, మే 9: రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, కేంద్రం కొనకున్నా తెలంగాణ రైతులు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేసే విధంగా సీఎం కేసీఆర్ ఏర్పాట్లు చేశారని మెదక్ జడ్పీ చైర్ పర్సన్ ర్యాకల హేమలతాశేఖర్గౌడ్ అన్నారు. సోమవారం మనోహరాబాద్ మండలం పోతారంలో పీఏసీఎస్ చైర్మన్ వెంకట్రామ్రెడ్డితో కలిసి వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీలు పురం నవనీతరవి ముదిరాజ్, కల్లూరి హరికృష్ణ, వైస్ ఎంపీపీ విఠల్రెడ్డి, ఎంపీటీసీ శ్రీలతాఆనంద్, సీఈవో మధు, సర్పంచ్ మాధవరెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షుడు ప్రభాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.