మెదక్, ఏప్రిల్ 26 : జిల్లాలో రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోలు కేంద్రాల్లో యాసంగి ధాన్యం సేకరణ ప్రారంభించాలని ఐకేపీ సిబ్బందికి జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీనివాస్ సూచించారు. మంగళవారం కలెక్టరేట్లోని ఆడిటోరియంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లపై ఏపీఎంలు, సీసీలు, వీవోఏలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సం దర్భంగా ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. యాసంగి సీజన్లో ఐకేపీ ద్వారా జిల్లాల్లో 102 ధాన్యం కొనుగోలు కేం ద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అకాల వర్షాలకు ధాన్యం తడిసి పోకుండా సరిపడా టార్ఫాలిన్లు సమకూర్చుకోవాలని సూచించారు. గోనెసంచుల వివరాలను జాగ్రత్తగా న మోదు చేసుకోవాలని, కొనుగోలు కేంద్రాన్ని మూసివేసిన వా రం రోజుల్లో గోనె సంచుల సేకరణ పూర్తి చేయాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో కావాల్సిన మౌలిక సదుపాయా లను సంబంధిత ఎంసీలకు వివరించి, సమకూర్చుకోవాలన్నా రు. కొనుగోలు కేంద్రం ప్రారంభించిన తర్వాత ధాన్యం కొను గోలు వివరాలను ప్రతిరోజూ ట్యాబ్లో రోజువారీగా నమోదు చేయాలని డీఆర్డీవో శ్రీనివాస్ సూచించారు.
జిల్లా పౌర సరఫరాల అధికారి(డీ ఎస్వో) శ్రీనివాస్ మాట్లాడుతూ.. యా సంగి సీజన్లో ట్రాన్స్ఫోర్టు కాంట్రాక్టర్ల ను మార్చామని, ఇకపై ఏ ఇబ్బందులుఉండవన్నారు. గోనె సంచులకు సంబంధించి లేదా రైస్ మిల్లులకు సంబంధించి ఏదైనా సమస్యలు ఉంటే నేరుగా మా దృష్టికి తీసుకురావాలని సూచించారు.
అడిషనల్ డీఆర్డీవో భీమయ్య మా ట్లాడుతూ.. రైతులు ఆధార్, పాస్బుక్, ఇతర వివరాల పత్రాలను ముందుగానే తెచ్చుకోవాలన్నారు. గోనెసంచుల లెక్క పక్కాగా ఉండేటట్టు చూసుకోవాలని, ట్యాబ్ ఎంట్రీ కూడా వెంటవెంటనే పూర్తి చేయాలని వివరిం చారు. కార్యక్రమంలో డీపీఎం మోహన్, వివిధ మండలాల ఏపీఎంలు, సీసీలు, వీవోఏ, ట్యాబ్ ఆపరేటర్లు, జిల్లా మహిళా సమాఖ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
హవేళీఘనపూర్, ఏప్రిల్ 26 : రైతులు ధాన్యాన్ని కొనుగో లు కేంద్రాలకు తరలించే ముందు నాణ్యతా ప్రమాణాలు పా టించాలని ఏఈవో రాఖేశ్ అన్నారు. మండలంలోని ఔరంగాబాత్తండాలో రైతులకు ధాన్యాన్ని తూకం వేసే ముందు పా టించాల్సిన అంశాలపై అవగాహన కల్పించారు. ధాన్యాన్ని పూ ర్తిగా ఆరబెట్టాలన్నారు. ప్రమాణాలు పాటిస్తేనే కొనుగోళ్లు సాఫీ గా సాగే జరుగుతాయని, దీనికి రైతులు సహకరించాలన్నారు.